Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
- వాటర్మిలన్, చికెన్ బిర్యానీ కలిపి తింటే ప్రమాదమా..?
- జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్న డాక్టర్లు..
- భోజనం తర్వాత పుచ్చకాయ తినకపోవడమే బెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food poisoning: ముంబైలో నలుగురు సభ్యుల కుటుంబం రాత్రి సమయంలో చికెన్ బిర్యానీ, వాటర్మిలన్ తిన్న తర్వాత మరణించారనే విషయం సంచలనంగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది ఫుడ్ పాయిజనింగ్ వల్లే వారు మరణించినట్లు భావిస్తున్నారు. దీంతో , ఇప్పుడు ప్రజలు పుచ్చకాయను విలన్గా చూస్తున్నారు.
నిజంగా ఈ రెండు కలిపి తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా? అంటే కాదనే సమాధానం డాక్టర్ వద్ద నుంచి వస్తోంది. కానీ ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. భారత్లో వేసవి సమయంలో వాటర్మిలన్ చాలా ఇష్టంగా తింటారు. వేడి నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి నీరు అధికంగా ఉంటే దీనిని తినడం చాలా మంచిదిగా భావిస్తారు.
Also Read
- Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
- Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
Read Also: Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
ఇదిలా ఉంటే, చాలా మంది భోజనం తర్వాత వాటర్మిలన్ తినడం వల్ల బ్లోటింగ్(కడుపు ఉబ్బరం)గా అనిపిస్తుందని చెబుతుంటారు. దీని కారణం ‘‘వాటర్ మిలన్’’. ఇది చాలా త్వరగా జీర్ణమవుతుంది. కానీ భోజనంతో ముఖ్యంగా ఫ్యాట్, ప్రొటీన్ ఉన్న ఆహారం తర్వాత తీసుకుంటే జీర్ణక్రియ బ్యాలెన్స్ తప్పుతుంది. ఆహారం కడుపులో ఎక్కువ సేపు ఉంటుంది. ఇదే కాకుండా వాటర్మిలన్లో ఉండే ఫ్రక్టోజ్ పులిసిపోతుంది. గ్యాస్ ఉత్పత్తి కావడం, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యానికి దారి తీస్తుంది.
త్వరగా జీర్ణమయ్యే వాటర్మిలన్ను, ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహారంతో కలిపి తిన్నప్పుడు మొత్త జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇరిటబుల్-బవెల్ సిండ్రోమ్ ఉన్నవారు లేదా వారి సాధారణ జీర్ణక్రియ పనితీరులో సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారు సాధారణ భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవాలి. ఏసిడిటీకి గురయ్యేవారు ఈ విధంగా తింటే కడుపు ఉబ్బరం సమస్యల్ని ఎదుర్కొంటారు. పుచ్చకాయను ఆహారంతో కలిపి తినడం కన్నా, ఆహారానికి ఆహారానికి మధ్య తింటే బెటరని డాక్టర్లు చెబుతున్నారు. పరిమితంగా తినాలి, పాల పదార్థాలు, వేయించిన ఆహారంతో తినొచ్చు. ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే చల్లగా తినకూడదు.
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!