Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
- వాటర్మిలన్, చికెన్ బిర్యానీ కలిపి తింటే ప్రమాదమా..?
- జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్న డాక్టర్లు..
- భోజనం తర్వాత పుచ్చకాయ తినకపోవడమే బెటర్..
Food poisoning: ముంబైలో నలుగురు సభ్యుల కుటుంబం రాత్రి సమయంలో చికెన్ బిర్యానీ, వాటర్మిలన్ తిన్న తర్వాత మరణించారనే విషయం సంచలనంగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది ఫుడ్ పాయిజనింగ్ వల్లే వారు మరణించినట్లు భావిస్తున్నారు. దీంతో , ఇప్పుడు ప్రజలు పుచ్చకాయను విలన్గా చూస్తున్నారు.
నిజంగా ఈ రెండు కలిపి తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా? అంటే కాదనే సమాధానం డాక్టర్ వద్ద నుంచి వస్తోంది. కానీ ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. భారత్లో వేసవి సమయంలో వాటర్మిలన్ చాలా ఇష్టంగా తింటారు. వేడి నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి నీరు అధికంగా ఉంటే దీనిని తినడం చాలా మంచిదిగా భావిస్తారు.
Also Read
- Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
- Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!
Read Also: Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
ఇదిలా ఉంటే, చాలా మంది భోజనం తర్వాత వాటర్మిలన్ తినడం వల్ల బ్లోటింగ్(కడుపు ఉబ్బరం)గా అనిపిస్తుందని చెబుతుంటారు. దీని కారణం ‘‘వాటర్ మిలన్’’. ఇది చాలా త్వరగా జీర్ణమవుతుంది. కానీ భోజనంతో ముఖ్యంగా ఫ్యాట్, ప్రొటీన్ ఉన్న ఆహారం తర్వాత తీసుకుంటే జీర్ణక్రియ బ్యాలెన్స్ తప్పుతుంది. ఆహారం కడుపులో ఎక్కువ సేపు ఉంటుంది. ఇదే కాకుండా వాటర్మిలన్లో ఉండే ఫ్రక్టోజ్ పులిసిపోతుంది. గ్యాస్ ఉత్పత్తి కావడం, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యానికి దారి తీస్తుంది.
త్వరగా జీర్ణమయ్యే వాటర్మిలన్ను, ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహారంతో కలిపి తిన్నప్పుడు మొత్త జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇరిటబుల్-బవెల్ సిండ్రోమ్ ఉన్నవారు లేదా వారి సాధారణ జీర్ణక్రియ పనితీరులో సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారు సాధారణ భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవాలి. ఏసిడిటీకి గురయ్యేవారు ఈ విధంగా తింటే కడుపు ఉబ్బరం సమస్యల్ని ఎదుర్కొంటారు. పుచ్చకాయను ఆహారంతో కలిపి తినడం కన్నా, ఆహారానికి ఆహారానికి మధ్య తింటే బెటరని డాక్టర్లు చెబుతున్నారు. పరిమితంగా తినాలి, పాల పదార్థాలు, వేయించిన ఆహారంతో తినొచ్చు. ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే చల్లగా తినకూడదు.
తాజావార్తలు
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో