Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Semiya Payasam: రాగితో ఇడ్లీ, దోసె, జావ, పొంగనాలంటూ వివిధ రకాల రెసిపీలు ప్రిపేర్ చేస్తుంటారు. ఇందులో పాయసం కూడా ఒకటి. రాగిపిండితో సేమియా కలిపి ఇలా కమ్మని పాయసం చేశారంటే ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు. బిగినర్స్ కూడా ఈ పద్ధతిలో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే పిల్లలైతే ఒకటికి రెండు గ్లాసులు ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధి ఉంటాయి. సాధారణ మైదా లేదా తెల్ల సేమియాతో పోలిస్తే, రాగి పాయసం శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా బరువు పెరగకుండా కాపాడుతుంది. రాగులలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా అందిస్తుంది. ఇలాంటి పోషకాలు ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు:
నెయ్యి:1 టీస్పూన్
రాగి సేమియా: 250 గ్రాములు
నీళ్ళు: 500 మి.లీ
పాలు: 1 లీటరు
యాలకుల పొడి: 1 టీస్పూన్
జాజికాయ పొడి: చిటికెడు
చిక్కటి/పలచటి కొబ్బరి పాలు: 500 మి.లీ
పాలు/సక్కెర (చక్కెర): 1/2 కప్పు
ఉప్పు:1/2 టీస్పూన్
Also Read
- Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
గార్నిషింగ్ కోసం:
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు:4 టేబుల్ స్పూన్లు
కిస్మిస్: 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం:
ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో టీస్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక, రాగి సేమియా వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు దోరగా వేయించాలి. అందులో 500 మి.లీ నీళ్ళు పోసి, రాగి సేమియా నీటిని పూర్తిగా పీల్చుకునే వరకు ఉడికించాలి. ఇప్పుడు పాలు, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. పాలు బాగా మరిగేంత వరకు ఉంచాలి. మంట తగ్గించి 15 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు కలిపి, మరొక పొంగు వచ్చే వరకు ఉంచాలి. పాయసం మెల్లగా చిక్కబడుతుంది. ఇప్పుడు పంచదార, చిటికెడు ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి. చిన్న మూకుడులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలను వేయించాలి. చివరిగా కిస్మిస్ వేసి అవి ఉబ్బే వరకు వేయించి పాయసంలో కలపాలి. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి సేమియా పాయసాన్ని వేడిగా అయినా లేదా చల్లార్చి ఫ్రిజ్లో పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు!
తాజావార్తలు
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!