Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
- NFHS-6 నివేదికలో డయాబెటిస్, ఊబకాయం కేసులు భారీగా పెరిగినట్లు వెల్లడి.
- పురుషుల్లో మధుమేహం 15.6% నుంచి 20.9%కు పెరుగుదల.
- మహిళల్లో డయాబెటిస్ రేటు 13.5% నుంచి 17.8%కు చేరిక.
- పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు సర్వే గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diabetes: కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయుల్లో ‘‘మెటాబాలిజం’’ వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. ఇంట్లో ఎక్కువ సమయం గడపడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు పెరగడం సమస్యను పెంచుతున్నాయి. ఊబకాయం, మధుమేహం(డయాబెటిస్) వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 (NFHS-6) నివేదిక వెల్లడించింది. 2023-24 కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా సుమారు 6.79 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయి. మణిపూర్ మినహా దేశవ్యాప్తంగా 715 జిల్లాలను సర్వే కవర్ చేసింది.
పురుషుల్లో పెరిగిన షుగర్ వ్యాధి:
15 ఏళ్లకు పైబడిన పురుషుల్లో డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరిగాయి. రక్తంలో చక్కెర స్థాయిలు 141mg/dl కంటే ఎక్కువగా ఉన్నవారిని లేదా డయాబెటిస్ మందులు తీసుకుంటున్నవారిని ఈ గణాంకాల్లో పరిగణించారు. 2019-20 నివేదికలో పురుషుల్లో డయాబెటిస్ 15.6 శాతంగా ఉండగా, NFHS-6లో అది 20.9 శాతానికి పెరిగింది. దేశంలో 15 ఏళ్లకు పూబడిన పురుషులు 56 కోట్ల మంది ఉంటే వీరిలో 11.7 కోట్ల మంది డయాబెటిస్తో బాధపడుతున్నారని వెల్లడైంది. 2021లో ఇది 8.7 కోట్లుగా ఉండేది.
Also Read
- Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
- Vastu Tips: ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి.? వాస్తు శాస్త్రం చెబుతుంది ఇదే..
- Rainy Season Tips: వర్షా కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి.. బ్యాడ్ స్మెల్ కూడా రాదు!
- Diabetes Diet: రోటీ vs అన్నం.. డయాబెటిస్ రోగులకు ఏది బెస్ట్?
మహిళల్లో కూడా మధుమేహం సమస్య పెరుగుతోంది. NFHS-5లో 13.5 శాతం ఉన్న మధుమేహం, ప్రస్తుతం 17.8 శాతానికి చేరుకుంది. మూడేళ్ల క్రితం 5.4 కోట్ల మంది మహిళలు డయాబెటిస్తో బాధపడుతుండగా, ఇప్పుడు ఆసంఖ్య 7.12 కోట్లకు పెరిగింది.
ఊబకాయం మరో సమస్య:
మధుమేహంతో పాటు మధుమేహానికి ప్రారంభ కారణాల్లో ఒకటైన ఊబకాయం కూడా వేగంగా పెరుగుతోంది. 15-49 ఏళ్ల మహిళల్లో అధిక బరువు, ఊబకాయం సమస్య 24 శాతం నుంచి 30.7 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పట్టణాల్లో 42.8 శాతం మహిళలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 25.5 శాతంగా నమోదైంది. పురుషుల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2019-20లో 22.9 శాతం ఉన్న అధిక బరువు, ఊబకాయం రేటు 2023-24లో 27.3 శాతానికి చేరుకుంది. పట్టణాల్లో 36.3 శాతం మంది పురుషులు, గ్రామీణ ప్రాంతాల్లో 23 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు సర్వే తెలిపింది.
తాజావార్తలు
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
-
Jobs: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
-
NIMS Recruitment : నిమ్స్లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!