Anemia Causes: రక్తహీనత వేధిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anemia Causes: రక్తహీనత అంటే సాధారణ సమస్య కాదని, ఇది శరీరానికి ముప్పు తెచ్చే నిశ్శబ్ద వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం ద్వారా ఆక్సిజన్ చేరవేయడం జరుగుతుంది. కానీ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతే దానిని రక్తహీనత (అనీమియా) అంటారు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు గణాంకాల ప్రకారం.. పురుషుల్లో సుమారు 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, అలాగే గర్భిణీలలో 52% మంది భారతీయులు రక్తహీనతతో బాధపడుతున్నారు.
READ ALSO: AP High Court: కడప ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్..
Also Read
- Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
- Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
- Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
రక్తహీనతతో ఏయే సమస్యలు వస్తాయంటే..
రక్తహీనత ఉన్నవారిలో శరీర శక్తి తక్కువగా ఉంటుంది. వారు త్వరగా అలసిపోవడం, నిరుత్సాహం, గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపై అధిక ఒత్తిడి పడి, గుండె వాపు లేదా ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీయవచ్చని వైద్యులు అంటున్నారు.
సాధారణంగా మనం సరిగ్గా తినకపోవడం వల్ల రక్తం తక్కువగా ఉంటుందని అంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వాస్తవానికి రక్తహీనత ఉన్నవారికి ఆకలి తగ్గుతుందని, అందుకే వాళ్లు తినడం తగ్గిస్తారని చెబుతున్నారు. మహిళల్లో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, హార్మోన్ల సమస్యలు (ఉదా: థైరాయిడ్), గర్భసంచి గడ్డలు వంటి పరిస్థితులు రక్తహీనతకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ఇది మరింత ప్రమాదకరం, వీళ్లు రక్తహీనతతో బాధపడుతుంటే వీరికి పుట్టే బిడ్డలు తక్కువ బరువుతో పుడతారని, అలాగే వీళ్లను ప్రసవం తర్వాత తీవ్రమైన నీరసం, బలహీనత ఆవరిస్తుందని చెబుతున్నారు.
కడుపులో అల్సర్ లేదా క్యాన్సర్ వంటి వ్యాధుల కారణంగా కూడా రక్తహీనత వస్తుందని, శరీరంలో ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుందని నిపుణులు పేర్కొన్నారు. రక్తహీనతను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదని వైద్యులు హెచ్చరించారు. దీని లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సరైన పరీక్షలు చేయించుకొని, ఆహారంలో ఇనుము ఉన్న పదార్థాలు (ఉదా: పాలకూర, కూరగాయలు, జాగ్రి, బీట్రూట్, పొడి పండ్లు) చేర్చుకోవాలని చెబుతున్నారు.
READ ALSO: Hyderabad Man In Russia: దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్న హైదరాబాదీ..
తాజావార్తలు
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!