AIC recruitment 2025: అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్.. నెలకు రూ.60 వేల జీతం
- అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్
- నెలకు రూ.60 వేల జీతం
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 20
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మంచి జీతాలు, ప్రభుత్వం కల్పించే సౌకర్యాల కారణంగా హెవీ డిమాండ్ ఉంటుంది. మీరు కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 55 పోస్టులు భర్తీకానున్నాయి.
భర్తీకానున్న పోస్టుల్లో మేనేజ్మెంట్ ట్రైనీ (జనరలిస్ట్)30, మేనేజ్మెంట్ ట్రైనీ (IT)20, మేనేజ్మెంట్ ట్రైనీ (యాక్చురియల్) 05 ఉన్నాయి. ఈ పోస్టులకు పోటీపడే వారు పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E/B.Tech/M.E/M.Tech/MCA/ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, యాక్చురియల్ సైన్స్, ఎకనామిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్లో బ్యాచిలర్/మాస్టర్స్/మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు మార్కులు 55 శాతంగా నిర్ణయించారు. అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.
Also Read
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
- Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
- Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
ఈ పోస్టులకు సీబీటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.60,000 జీతం అందిస్తారు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST/PH అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ. 200గా నిర్ణయించారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 20 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!