US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఆగేందుకు, మధ్యప్రాచ్యంలో శాంతి కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నాలుగు సూత్రాల రోడ్ మ్యాప్ను ప్రతిపాధించినట్లు చైనా అధికారిక మీడియా జిన్హూవా నివేదించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత చైనా నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. సౌదీ అరేబియా పర్యటనలో సమయంలో జిన్పింగ్ ఈ ప్రతిపాదన చేశారు. మంగళవారం అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమై నాలుగు సూత్రాల రోడ్మ్యాప్ను ప్రతిపాదించినట్లు చైనీస్ మీడియా పేర్కొంది.
Read Also: Stress and Anxiety: స్ట్రెస్, డిప్రెషన్ తగ్గించే సహజ మార్గాలు.. ఆందోళన నుంచి బయటపడడం ఎలా?
ప్రాంతీయ శాంతియుత సహజీవనం, జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, అభివృద్ధి-భద్రత సమన్వయం , అంతర్జాతీయ నియమాల ఆధారిత వ్యవస్థను పరిరక్షించడం వంటి నాలుగు సూత్రాలను జిన్ పింగ్ ప్రతిపాదించారు. ‘‘అంతర్జాతీయ చట్టబద్ధమైన పాలన అధికారాన్ని మనం కాపాడాలి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడం, అనుకూలంగా లేనప్పుడు వదిలేయడం కుదరదు. అలాగే, ప్రపంచం తిరిగి అరాచక పాలనలోకి జారిపోవడానికి మనం అనుమతించలేము’’ అని జిన్ పింగ్ అన్నారు.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత, జిన్ పింగ్ యూఏఈ పర్యటన జరిగింది. యుద్ధం గురించి నేరుగా కామెంట్స్ చేయకున్నా పరోక్షంగా అమెరికా-ఇజ్రాయిల్ను సూచిస్తూ జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరోవైపు, వచ్చే నెలలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
