New Act: పార్లమెంట్లో కీలక చట్టం.. సైబర్ నేరాలకు మరణశిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మయన్మార్ పార్లమెంట్ ఆన్లైన్ స్కామ్ మోసాలపై ఉక్కుపాదం మోపేందుకు మంగళవారం ఒక నూతన చట్టాన్ని ఆమోదించింది. ఈ ‘యాంటీ ఆన్లైన్ స్కామ్ బిల్లు’ ప్రకారం.. సైబర్ స్కామ్ సెంటర్లలో ప్రజలను అక్రమంగా బంధించినా, హింసించినా లేదా బలవంతంగా పనిచేయించినా మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా కఠిన నిబంధనలను పొందుపరిచారు. రాజధాని నేపిడాలో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసినట్లు స్పీకర్ ఆంగ్ లిన్ ద్వే తెలిపారు.
సహాయం పేరుతో లేదా ఉద్యోగాల ఆశ చూపి మనుషులను ట్రాఫికింగ్ చేసి, ఆన్లైన్ మోసాలకు పాల్పడేలా తీవ్రంగా వేధించే వారికి ఈ శిక్షలు వర్తిస్తాయి. బాధితులను కిడ్నాప్ చేసి లేదా అక్రమంగా బంధించి క్రూరంగా ప్రవర్తించడం వల్ల వారు మరణిస్తే, నిందితులకు ఖచ్చితంగా మరణశిక్షే విధించబడుతుంది. అలాగే డిజిటల్ కరెన్సీ (క్రిప్టో) స్కామ్లు నడిపే వారికి, సైబర్ క్రైమ్ కేంద్రాలను నిర్వహించే ముఠా నాయకులకు గరిష్టంగా జీవిత ఖైదు పడేలా ఈ చట్టంలో స్పష్టమైన ప్రొవిజన్లు ఉన్నాయి.
Also Read
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
మయన్మార్ సైనిక తిరుగుబాటు తర్వాత ఏర్పడిన అంతర్యుద్ధం, అస్థిరతల వల్ల అక్కడ ఆన్లైన్ మోసాల నెట్వర్క్లు భారీగా విస్తరించాయి. ఉద్యోగాల కోసం వచ్చి మోసపోయిన విదేశీయులను కంబౌండ్లలో బంధించి, డేటింగ్, క్రిప్టో పెట్టుబడుల పేరిట ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను బురిడీ కొట్టించేలా తీవ్రంగా హింసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎఫ్ఏటీఎఫ్ (FATF) వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ వ్యవహారంపై హెచ్చరికలు జారీ చేశాయి.
2021లో అంగ్సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారం చేపట్టిన సైనిక మాజీ అధిపతి మిన్ ఆంగ్ లైంగ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఆమోదించిన తొలి చట్టం ఇదే కావడం గమనార్హం. ప్రతిపక్షాలు, సూకీ పార్టీ పాల్గొనకుండా ఇటీవల నిర్వహించిన వివాదాస్పద ఎన్నికల అనంతరం ఈ పార్లమెంట్ కొలువుదీరింది. అంతర్జాతీయంగా వస్తున్న తీవ్ర విమర్శలు, ఒత్తిళ్ల నేపథ్యంలో సైబర్ రంగాన్ని నియంత్రించేందుకు మయన్మార్ ఈ కఠినమైన చట్టాన్ని అమలులోకి తెచ్చింది.
తాజావార్తలు
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!