China: వెయిట్ తగ్గించుకో.. గిప్ట్ తీసుకో..
- ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన చైనా కంపెనీలు
- బరువు తగ్గడం కోసం ఉద్యోగులకు బంఫర్ ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలోని కొన్ని కంపెనీలు ఉద్యోగులకు చిత్ర విచిత్రమైన ఆఫర్లు ఇస్తుంటాయి. తాజాకే ఇలాంటిదే ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది చైనాలోని ఓ కంపెనీ..
పూర్తి వివారాల్లోకి వెళితే…చైనా కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ అంటే వర్క్ కాంపిటీషన్ పెట్టి.. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి ప్రైజ్ లు ఇవ్వటం కాదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వారి కోసం ఓ పోటీని నిర్వహించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్లు మంచి ఆఫర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
షెంజెన్ లో ఉన్న ఆరాషి విజన్ అనే టెక్నాలజీ కంపెనీ వినూత్నమైన పోటీలు నిర్వహించి ఉద్యోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఇనిషియేషన్ కు శ్రీకారం చుట్టింది. మొత్తం ఒక కోటి 23 లక్షల రూపాయల బోనస్ ను ఉద్యోగులకు ప్రకటించింది. వెయిట్ లాస్ అవుతూ ఆరోగ్యంగా తయారయ్యేందుకు ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొంది.
కంపెనీ పెట్టిన వెయిట్ లాస్ ఛాంపియన్ ప్రోగ్రాంకు అనూహ్య స్పందన వచ్చింది. ఉద్యోగులు పోటీ పడి మరీ బరువు తగ్గుతున్నారు. గ్సై యాక్వీ అని ఉద్యోగి ఏకంగా మూడు నెలల్లోనే 20 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో కంపెనీ అతినిక వెయిట్ లాస్ ఛాంపియన్ అవార్డుతో పాటు రూ.2 లక్షల 34 వేల ప్రైజ్ మనీ కూడా అందజేసింది.
ప్రతి సీజన్ లో 30 మంది ఉద్యోగులు ఈ కాంపిటీషన్ లో పాల్గొంటారు. ప్రతి అరకిలో (0.5kg) తగ్గుదలకు దాదాపు 6 వేల రూపాయలు ఇస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 2022 నుంచి ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 7 రౌండ్ల పోటీలు జరిగాయి. ఈ పోటీల కోసం ఇప్పటి వరకు రూ.2 కోట్ల 34 లక్షలను వెచ్చించినట్లు తెలిపారు. ఈ కాంపెటీషన్ వలన ఉద్యోగుల ఆరోగ్యంతో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ ప్రమోట్ చేయాలని భావించినట్లు కంపెనీ చెబుతోంది. దీని కారణంగా ఉద్యోగుల పర్ఫామెన్స్ కూడా పెరిగి కంపెనీ ప్రొడక్టివిటీలో మంచి రిజల్ట్స్ వచ్చినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?