వైద్య రంగంలో న్యూయార్క్, మెక్సికో వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో ఒక మహిళకు కృత్రిమ గర్భధారణ కలిగించారు. తాజాగా 40 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఏఐ టెక్నాలజీతో శిశువు జన్మించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Cyberabad: సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాలను పట్టుకున్న పోలీసులు.. 1060 సెల్ ఫోన్లు స్వాధీనం
ఏఐ సాయంతో శుక్ర కణాన్ని నేరుగా అండంలోకి పంపించారు. ఐవీఎఫ్లో ఈ ప్రక్రియ సర్వసాధారణమైంది. ఐవీఎఫ్లో ఇప్పటి వరకు మానవ సాయంతోనే జరిగింది. కానీ ఈసారి మాత్రం 23 దశలను మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో వైద్య బృందం పూర్తి చేసింది. పూర్తిస్థాయి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంలో సంతానోత్పత్తిని కల్పించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. దీంతో 1990 నుంచి వైద్యులు ఉపయోగిస్తున్న ఐసీఎస్ఐ సాధారణ ప్రక్రియకు ఇది ప్రత్యామ్నాయంగా మారింది. ఈ ప్రక్రియ అంతా మానవ ప్రమేయం లేకుండానే జరగడం విశేషం. పూర్తిగా ఏఐ సాయంతోనే 40 ఏళ్ల మహిళ గర్భం ధరించడం జరిగింది. ప్రస్తుత వైద్య రంగంలో ఇదొక సంచలనంగా మారింది. మెక్సికోలో ప్రస్తుతం మహిళ, శిశువు క్షేమంగానే ఉన్నారు.
ఇది కూడా చదవండి: IPL 2025: మాకు యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడు.. సీఎస్కే విజయాల బాట పడుతుంది: రుతురాజ్
పిండ శాస్త్రవేత్త డాక్టర్ జాక్వెస్ కోహెన్ నేతృత్వంలో ఈ ప్రక్రియ జరిగింది. న్యూయార్క్, మెక్సికోలోని గ్వాడలజారాలోని కన్సీవబుల్ లైఫ్ సైన్సెస్ నిపుణుల బృందం ఈ ప్రక్రియ చేపట్టింది. ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించారు. గతంలో విఫలమైన ఈ ప్రయత్నం.. తాజాగా విజయవంతం కావడంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Google Layoffs: భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన గూగుల్..