Titan: సముద్రంలో పేలిపోయిన “టైటాన్”.. విధ్వంసానికి కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titan: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శిథిలాలు చూసేందుకు టూరిస్టులను తీసుకెళ్లిన ‘టైటాన్’ సబ్మెర్సిబుల్ ఆచూకీ లభించింది. టైటానికి సమీపంలోనే దీని శిథిలాలను కనుగొన్నారు. అయితే టైటాన్ మిస్సైన కొద్ది సేపటికే అది పేలిపోయినట్లు యూఎస్ నేవీ గుర్తించింది. అండర్వాటర్ సౌండ్ మానిటరింగ్ పరికరాల ద్వారా టైటాన్ సబ్మెర్సిబుల్ పేలినట్లు యుఎస్ నేవీ గుర్తించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గురువారం నివేదించింది. మ్యూనికేషన్లు కోల్పోయినప్పుడు టైటాన్ సబ్మెర్సిబుల్ పనిచేస్తున్న సాధారణ పరిసరాల్లో పేలుడు లేదా పేలుడుకు అనుగుణంగా ఉండే అసాధారణతను గుర్తించింది అని అధికారి జర్నల్తో చెప్పారు. దాదాపుగా నాలుగు రోజుల వెతుకులాట తర్వాత సముద్రగర్భంలో 3800 మీటర్లు లోతులో టైటాన్ అవశేషాలను యూఎస్ కోస్ట్ గార్డ్ కనుగొంది. టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది.
Read Also: PM Modi: ఇండియా త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది..
Also Read
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
టైటానిక్ శిథిలాలు దాదాపుగా సముద్ర ఉపరితలం నుంచి 4 కిలోమీటర్ల లోతులో ఉన్నాయి. వీటిని చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషన్ గేట్ ఇంక్ అనే కంపెనీ టైటాన్ అనే ఒక సబ్ మెర్సిబుల్ సహాయంతో ఇంతకుముందు అనేక సార్లు సముద్రంలోకి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూపించింది. ఈ సారి మాత్రం ‘కాటస్ట్రిఫిక్ ఇంప్లోజన్’ కారణంగా టైటాన్ పేలిపోయింది. సముద్ర అడుగు భాగంలో విపరీతమైన పీడనాన్ని తట్టుకునే విధంగా టైటాన్ రూపొందించబడింది. అయితే ఈ సారి మాత్రం ఆ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. టైటాన్ ఉన్న ప్రాంతంలో సాధారణ వాతావరణ పీడనంలో పోలిస్తే 400 రెట్లు పీడనం ఉంటుంది. సముద్రం మట్టం వద్ద వాతావరణ పీడనం చదరపు అంగుళానికి 14.7 పౌండ్లు (psi) ఉంటుంది. నీటిలో లోపట 6000 psi ఉంటుంది.
అంతటి శక్తిని టైటాన్ తట్టుకోలేక పేలిపోయినట్లు తెలుస్తోంది. అపారమైన నీటి పీడనం వల్ల సబ్ మెరైన్ మల్లి సెకన్లలో కుప్పకూలింది. నిజానికి టైటాన్ అంతటి పీడనాన్ని తట్టుకునేలా తయారు చేయబడింది. అయితే అందులో భద్రతాపరమైన సమస్యలు తలెత్తి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రెషర్ హాల్ వైఫల్యం’ వల్ల పేలుడు సంభవించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!