Iran: ‘‘ఇజ్రాయిల్ ఎప్పటికీ గెలవలేదు’’.. సుప్రీంలీడర్ ఖమేనీ మెగా స్పీచ్..
- ఇజ్రాయిల్ ఎప్పటికీ గెలవలేదు..
- హిజ్బుల్లా.. పాలస్తీనియన్లు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది..
- నస్రల్లా మరణం వృథా కాదు..
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పీచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం, ఇజ్రాయిల్పై ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ క్షిపణి దాడుల తర్వాత తొలిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఉపన్యసించారు. ‘‘మేము మా శత్రువులను ఓడిస్తాము’’ అని ఖమేనీ ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. శుక్రవారం తన ఉపన్యాసంలో ఇజ్రాయిల్కి వ్యతిరేఖంగా పాలస్తీనియన్లకు, లెబనీస్ ప్రజలకు మద్దతు తెలిపారు. తమ శత్రువులను ఓడించాలని ప్రతిజ్ఞ చేశారు. టెహ్రాన్లోని ఒక మసీదు వద్ద వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ఖమేనీ మాట్లాడారు. ఇటీవల ఇజ్రాయిల్పై జరిగిన క్షిపణి దాడుల్ని ‘‘ప్రజాసేవ’’గా అభివర్ణించారు. హమాస్ లేదా హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ఎన్నటికీ విజయం సాధించలేదని, ఇరాన్ మీతో ఉందని అతను ప్రకటించాడు.
Read Also: Toilet Tax: హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ గందరగోళం..
Also Read
- Iran-US: హమ్మయ్య.. అమెరికాతో ఒప్పందానికి లైన్క్లియర్!.. ఇరాన్ కీలక ప్రకటన
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఇటీవల హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత ఖమేనీ రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అతడి ప్రాణాలకు ఇజ్రాయిల్ నుంచి ప్రమాదం ఉందనే నివేదికల నేపథ్యంలో ఈ వార్తలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే, గత ఐదేళ్లలో తొలిసారిగా ఖమేనీ శుక్రవారం రోజు ఉపన్యసించారు. మంగళవారం ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ వార్నింగ్ ఇచ్చింది.
ఖమేనీ తన ప్రసంగంలో హసన్ నస్రల్లాని కొనియాడారు. నస్రల్లా మనతో లేకున్నా, అతడి ఆత్మ, అతడి మార్గం మనకు ఎప్పటికీ స్పూర్తినిస్తుందని చెప్పాడు. అతడి బలిదానం మరింత ప్రభావాన్ని పెంచుతుందని అన్నాడు. నస్రల్లా మరణం వృథా కాదని, మన విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉంటుందని, శత్రువులకు వ్యతిరేకంగా నిలబడాలని అన్నారు. లెబనాన్ రక్తపాతంలో ఉన్న ప్రజలకు సాయం చేయడానికి జిహాద్, అల్ అక్సా మసీదు కోసం యుద్ధానికి మద్దతు ఇవ్వడం ముస్లింలందరి విధి, బాధ్యత అని ఆయన అన్నారు. ఇజ్రాయిల్పై అక్టోబర్ 07 నాటి దాడిని సరైన చర్యగా అభివర్ణించాడు.
తాజావార్తలు
-
VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్కు స్టార్ ప్లేయర్ గుడ్బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్కు ముగింపు
-
Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
-
Peddi Team: కోడి రామ్మూర్తి నాయుడు వారసుడి ఇంటికి ‘పెద్ది’ టీమ్
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!