Vivek Ramaswamy: భారతీయులకు వివేక్ షాక్.. H-1B వీసా ప్రోగ్రామ్ని ముగించాలని వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Ramaswamy: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ జరుగుతోంది. ఈ సారి అధ్యక్ష బరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఒకరు వివేక్ రామస్వామి కాగా.. మరొకరు నిక్కీహేలి. ఇటీవల వివేక రామస్వామి పలుమార్లు ట్రంపును పొగడటం, తాను అధ్యక్షుడినైతే యూఎస్ క్యాపిటల్ పై దాడులకు పాల్పడిన ట్రంప్ మద్దతుదారులకు క్షమాభిక్ష పెడతానంటూ వార్తల్లో నిలిచారు. దీంతో పాటు ఫెడరల్ ఉద్యోగులను, ఎఫ్బీఐ ఉద్యోగులను తగ్గిస్తానంటూ హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే వివేక్ రామస్వామి భారతీయులకు షాక్ ఇస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయులు అమెరికాకు వెళ్లేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్న H-1B వీసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిస్తే తాను వీసా వ్యవస్థలో మార్పులు చేస్తానంటూ హామీలిస్తున్నారు. ముఖ్యంగా H-1B వీసాలను ముగించాలని అనుకుంటున్నాడు. స్వయంగా అమెరికాకు వెళ్లిన వివేక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అతను ఈ వీసాను 29 సార్లు ఉపయోగించాడు. లాటరీ వ్యవస్థ స్థానంలో మెరిటోక్రాటిక్ ప్రవేశంగా మారుస్తానని చెబుతున్నాడు.
Also Read
భారతీయులకే అధికంగా వీసాలు:
H-1B వీసాపై భారతీయ ఐటీ నిపుణులు అమెరికా వెళ్తున్నారు. యూఎస్ కంపెనీలు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిపుణులను అమెరికాలో నియమించుకునేందుకు ఈ వీసాలు ఉపయోగపడుతున్నాయి. ఇండియా, చైనాల నుంచే ఎక్కువ మంది ఈ వీసాలను పొందుతున్నారు. H-1B వీసా వ్యవస్థ చెడ్డదని వ్యాఖ్యానించారు. H-1B వల్ల కేవలం ఆ వ్యక్తిని స్పాన్సర్ చేసిన కంపెనీకి మాత్రమే ప్రయోజనం చేకూరుతోందని అంటున్నారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించినా, పత్రాలు లేని వలసదారుల పిల్లలనను బహిష్కరిస్తానని కూడా వివేక్ చెప్పారు.
ప్రతీ ఏడాది అమెరికా 65,000 H-1B వీసాలను అందజేస్తుంది. జూలై నెలలో భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి H-1B వీసాలను రెట్టింపు చేయాలని, దీని సంఖ్యను 1,30,000 పెంచాలని బిల్లు ప్రవేశపెట్టాడు. H-1B వీసాలలో దాదాపు నాలుగింట మూడు వంతులు భారతీయ నిపుణులకే అందుతున్నాయి. అయితే వివేక్ రామస్వామి మాత్రం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వ్యాఖ్యల లాగే వివేక్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!