China spy balloon: అమెరికా అణుక్షిపణి కేంద్రాలపై చైనా స్పై బెలూన్.. కూల్చేందుకు సిద్ధమైన అగ్రరాజ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China spy balloon: అమెరికా, చైనా మధ్య హై ఆల్టిట్యూడ్ బెలూన్ ఒకటి ఉద్రిక్తతలను పెంచుతోంది. చైనా నిఘా బెలూన్ గా అనుమానిస్తున్న అమెరికా దాన్ని కూల్చేందుకు సిద్ధం అయింది. కమర్షియల్ విమానాలు ఎగిరే ఎత్తు కన్నా పైన ఈ బెలూన్ ఉన్నట్లు పెంటగాన్ గుర్తించింది. ఈ బెలూన్ ను ట్రాక్ చేస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. నిఘా కోసమే దీన్ని చైనా ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీన్ని కూల్చేందుకు అమెరికా తన ఎఫ్-22 ఫైటర్ జెట్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా, దీన్ని కూల్చడం వల్ల శకలాలు నేలపై పడి ప్రజలకు ప్రమాదం వాలిల్లే అవకాశం ఉందని అధికారులు అధ్యక్షుడు జో బైడెన్ కు సూచించారు.
Read Also: Apple: యాపిల్ చూపు.. భారత్ వైపు.. ఎందుకంటే?
Also Read
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ప్రస్తుతం ఈ బెలూన్ ఉత్తర అమెరికా మీదుగా కెనడా, అలస్కా వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఇది అణు క్షిపణి కేంద్రాలపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తున్నట్లు యూఎస్ అనుమానిస్తోంది. బుధవారం ఈ బెలూన్ అమెరికాలోని మోంటానా రాష్ట్రంపై ఉన్నట్లు గుర్తించారు. అమెరికాలో మూడు భూగర్భ అణుక్షిపణి కేంద్రాలు ఉంటే అందులో ఒకటి మాల్మ్ స్ట్రోమ్ వైమానిక స్థావరం వద్ద ఉంది. దీనిపై నుంచి బెలూన్ ఎగిరినట్లు అనుమానిస్తున్నారు. అయితే దీని వల్ల పెద్దగా ఇంటెలిజెన్స్ సమాచారం లీక్ కాకపోవచ్చని అమెరికన్ అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ బెలూన్ వ్యవహారం రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడారు. వాస్తవాలను ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చైనా శుక్రవారం వెల్లడించింది. అమెరికా అగ్రశ్రేణి దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ బీజింగ్లో పర్యటించడానికి ముందు ఈ బెలూన్ వ్యవహారం వచ్చింది. వాస్తవాలు స్పష్టంగా కనిపించే వరకు, ఉహాగానాలు చేయడం, హైప్ పెంచడం వంటివి సమస్య పరిష్కారానికి సహాయపడవు అని మావో నింగ్ అన్నారు. చైనా బాధ్యతాయుతమైన దేశం, అంతర్జాతీయ చట్టాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది, ఏ సార్వభౌమాధికార దేశం యొక్క భూభాగాన్ని లేదా గగనతలాన్ని ఉల్లంఘించే ఉద్దేశం మాకు లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!