US Senator: ఆధునిక భారతదేశంలో 1984 చీకటి సంవత్సరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1984 One Of “Darkest Years” In Indian History says US Senator:ఆధునిక భారతదేశంలో 1984 సంవత్సరాన్ని చీకటి సంవత్సరంగా అభివర్ణించారు అమెరికా సెనెటర్ పాట్ టూమీ. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు భారతదేశ చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోయిందని అన్నారు. సిక్కులపై జరిగిన అల్లర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ 31, 1984న మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఇద్దరు సిక్కు అంగరక్షకులు చంపిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి. సిక్కులే టార్గెట్ గా ఢిల్లీలో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. భారతదేశం అంతటా 3 వేల మంది సిక్కులు చంపబడ్డారు.
భారతదేశంలో జాతుల మధ్య హింసాత్మక సంఘటనను ప్రపంచం చూసిందని.. ఈ హింసలో సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు పెన్సిల్వేనియా సెనెటర్ పాట్ టూమీ. 1984,నవంబర్ 1న జరిగిన అల్లర్లను ఆయన ప్రస్తావించారు. దాదాపుగా 30,000 మందికి పైగా సిక్కు మహిళలను, పురుషులను, పిల్లలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆయన అన్నారు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
READ ALSO: Bhatti Vikramarka: గాంధీజీ అడుగు జాడల్లోనే భారత్ జోడో యాత్ర
భవిష్యత్తులో మానవహక్కుల ఉల్లంఘనలను నివారించడానికి, ఇతర సమాజాలపై అఘాయిత్యాలు జరగకుండా చూడాలని టూమీ అన్నారు. అమెరికన్ సిక్కు కాంగ్రస్ కాకస్ సభ్యుడిగా టూమీ ఉన్నారు. సిక్కుమతం దాదాపుగా 600 ఏళ్ల చరిత్ర కలిగి భారతదేశంలోని పంజాబ్ అంతటా విస్తరించిందని.. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3 కోట్ల మంది సిక్కులు ఉన్నారని.. అమెరికాలో 7 లక్షల మంది నివసిస్తున్నారని ఆయన అన్నారు. అమెరికాలో కోవిడ్ మహమ్మారి సమయంలో పెన్సిల్వేనియాతో పాటు, యునైటెడ్ స్టేట్స్ లోని సిక్కు సంఘాలు జాతి, మతం అని తేడా లేకుండా పదివేల కుటుంబాలకు కిరణా సరకులు, మాస్కులు, ఇతర సామాాగ్రి అందించారని టూమీ అన్నారు. సిక్కుల స్ఫూర్తిని తాను వ్యక్తిగతంగా చూశానని సమానత్వం, గౌరవం, శాంతిపై స్థాపించబడిన సిక్కు సంప్రదాయాన్ని బాగా అర్థం చేసుకున్నామని టూమీ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!