US Senator: ఆధునిక భారతదేశంలో 1984 చీకటి సంవత్సరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1984 One Of “Darkest Years” In Indian History says US Senator:ఆధునిక భారతదేశంలో 1984 సంవత్సరాన్ని చీకటి సంవత్సరంగా అభివర్ణించారు అమెరికా సెనెటర్ పాట్ టూమీ. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు భారతదేశ చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోయిందని అన్నారు. సిక్కులపై జరిగిన అల్లర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ 31, 1984న మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఇద్దరు సిక్కు అంగరక్షకులు చంపిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి. సిక్కులే టార్గెట్ గా ఢిల్లీలో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. భారతదేశం అంతటా 3 వేల మంది సిక్కులు చంపబడ్డారు.
భారతదేశంలో జాతుల మధ్య హింసాత్మక సంఘటనను ప్రపంచం చూసిందని.. ఈ హింసలో సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు పెన్సిల్వేనియా సెనెటర్ పాట్ టూమీ. 1984,నవంబర్ 1న జరిగిన అల్లర్లను ఆయన ప్రస్తావించారు. దాదాపుగా 30,000 మందికి పైగా సిక్కు మహిళలను, పురుషులను, పిల్లలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆయన అన్నారు.
Also Read
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
READ ALSO: Bhatti Vikramarka: గాంధీజీ అడుగు జాడల్లోనే భారత్ జోడో యాత్ర
భవిష్యత్తులో మానవహక్కుల ఉల్లంఘనలను నివారించడానికి, ఇతర సమాజాలపై అఘాయిత్యాలు జరగకుండా చూడాలని టూమీ అన్నారు. అమెరికన్ సిక్కు కాంగ్రస్ కాకస్ సభ్యుడిగా టూమీ ఉన్నారు. సిక్కుమతం దాదాపుగా 600 ఏళ్ల చరిత్ర కలిగి భారతదేశంలోని పంజాబ్ అంతటా విస్తరించిందని.. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3 కోట్ల మంది సిక్కులు ఉన్నారని.. అమెరికాలో 7 లక్షల మంది నివసిస్తున్నారని ఆయన అన్నారు. అమెరికాలో కోవిడ్ మహమ్మారి సమయంలో పెన్సిల్వేనియాతో పాటు, యునైటెడ్ స్టేట్స్ లోని సిక్కు సంఘాలు జాతి, మతం అని తేడా లేకుండా పదివేల కుటుంబాలకు కిరణా సరకులు, మాస్కులు, ఇతర సామాాగ్రి అందించారని టూమీ అన్నారు. సిక్కుల స్ఫూర్తిని తాను వ్యక్తిగతంగా చూశానని సమానత్వం, గౌరవం, శాంతిపై స్థాపించబడిన సిక్కు సంప్రదాయాన్ని బాగా అర్థం చేసుకున్నామని టూమీ అన్నారు.
తాజావార్తలు
-
Harry Brook: వరల్డ్ నంబర్వన్ భారత్పై రెండు సిరీస్లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
-
Honor X7e Plus 5G: హానర్ X7e ప్లస్ 5G రిలీజ్.. 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4 చిప్, 50MP కెమెరా
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!