US Senator: ఆధునిక భారతదేశంలో 1984 చీకటి సంవత్సరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1984 One Of “Darkest Years” In Indian History says US Senator:ఆధునిక భారతదేశంలో 1984 సంవత్సరాన్ని చీకటి సంవత్సరంగా అభివర్ణించారు అమెరికా సెనెటర్ పాట్ టూమీ. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు భారతదేశ చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోయిందని అన్నారు. సిక్కులపై జరిగిన అల్లర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అక్టోబర్ 31, 1984న మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఇద్దరు సిక్కు అంగరక్షకులు చంపిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి. సిక్కులే టార్గెట్ గా ఢిల్లీలో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. భారతదేశం అంతటా 3 వేల మంది సిక్కులు చంపబడ్డారు.
భారతదేశంలో జాతుల మధ్య హింసాత్మక సంఘటనను ప్రపంచం చూసిందని.. ఈ హింసలో సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు పెన్సిల్వేనియా సెనెటర్ పాట్ టూమీ. 1984,నవంబర్ 1న జరిగిన అల్లర్లను ఆయన ప్రస్తావించారు. దాదాపుగా 30,000 మందికి పైగా సిక్కు మహిళలను, పురుషులను, పిల్లలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆయన అన్నారు.
Also Read
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
READ ALSO: Bhatti Vikramarka: గాంధీజీ అడుగు జాడల్లోనే భారత్ జోడో యాత్ర
భవిష్యత్తులో మానవహక్కుల ఉల్లంఘనలను నివారించడానికి, ఇతర సమాజాలపై అఘాయిత్యాలు జరగకుండా చూడాలని టూమీ అన్నారు. అమెరికన్ సిక్కు కాంగ్రస్ కాకస్ సభ్యుడిగా టూమీ ఉన్నారు. సిక్కుమతం దాదాపుగా 600 ఏళ్ల చరిత్ర కలిగి భారతదేశంలోని పంజాబ్ అంతటా విస్తరించిందని.. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3 కోట్ల మంది సిక్కులు ఉన్నారని.. అమెరికాలో 7 లక్షల మంది నివసిస్తున్నారని ఆయన అన్నారు. అమెరికాలో కోవిడ్ మహమ్మారి సమయంలో పెన్సిల్వేనియాతో పాటు, యునైటెడ్ స్టేట్స్ లోని సిక్కు సంఘాలు జాతి, మతం అని తేడా లేకుండా పదివేల కుటుంబాలకు కిరణా సరకులు, మాస్కులు, ఇతర సామాాగ్రి అందించారని టూమీ అన్నారు. సిక్కుల స్ఫూర్తిని తాను వ్యక్తిగతంగా చూశానని సమానత్వం, గౌరవం, శాంతిపై స్థాపించబడిన సిక్కు సంప్రదాయాన్ని బాగా అర్థం చేసుకున్నామని టూమీ అన్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!