Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. పారిస్ వేదికగా చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మరోసారి సంధికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పారిస్ వేదికగా ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయి్ల ఉన్నతాధికారులు భేటీ అయినట్లు సమచారం. ఈ యుద్ధం వల్ల ప్రపంచశాంతికి భంగం కలుగుతోందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలు వెస్ట్రన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయిల్ని కోరుతున్నాయి. మరోవైపు హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలుమార్లు వెల్లడించారు.
Read Also: Akkineni Nagarjuna: నన్నెవ్వరు నమ్మలేదు.. చివరికి అమల కూడా.. పిచ్చి పట్టిందా అన్నట్లు.. ?
Also Read
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ఇరు వర్గాల మధ్య సంధి కోసం ఫ్రెంచ్ అధికారులు ఖతార్, పాలస్తీనా, ఈజిప్ట్, ఇజ్రాయిల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ ఇజ్రాయిల, ఈజిప్ట్ అధికారులతో పాటు రాబోయే రోజుల్లో ఖతార్ ప్రధానిని కలుస్తారని పలువర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణకు బదులుగా హమాస్ ఆధీనంలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేసేందుక చర్చలు జరపడానికి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ సీఐఏ చీఫ్ని పంపుతున్న గత వారం ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 100 మందికి పైగా బందీలను విడుదల చేస్తే ప్రతిఫలంగా గాజాలో ఇజ్రాయిల్ తన యుద్ధాన్ని రెండు నెలల పాలు నిలిపివేసే ఒప్పందాన్ని అమెరికా నేతృత్వంలోని మధ్యవర్తులు సంధి చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ శనివారం వెల్లడించింది. ఇప్పటికే సంధిక సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని ఆదివారం పారిస్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. బందీలను విడిపించేందుకు బైడెన్ ఖతార్ ఎమిర్తో మాట్లాడారు.
గతేడాది నవంబర్ నెలలో ఇలాగే సంధి జరిగింది. దీనికి ఖతార్, ఈజిప్ట్ అధికారులు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే అందుకు ప్రతిఫలంగా హమాస్ తమ చెరలోని ఇజ్రాయిల్ బందీలలో కొందర్ని విడిచిపెట్టింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది హతమార్చింది. 250 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది. ప్రస్తుతం వీరిలో 132 మంది గాజాలో ఉన్నట్లు ఇజ్రాయిల్ చెబుతోంది. ఇందులో 28 మంది బందీలు చనిపోయారు. మరోవైపు ఇజ్రాయిల్ దాడుల్లో 26,000కి పైగా పాలస్తీనా ప్రజలు మరణించారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?