US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!
- మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు
- జూలై 11న చర్చలు జరిగే అవకాశం
- ఖమేనీ అంత్యక్రియల తర్వాత పూర్లి క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామాబాద్ వేదికగా మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామాబాద్ను తదుపరి సమావేశానికి అనువైన వేదికగా ఎంపిక చేసినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జూలై 11 తేదీని పరిశీలిస్తున్నప్పటికీ.. ఇరాన్లోని తాజా పరిణామాలను బట్టి తుది తేదీ మారే అవకాశం ఉందని సమాచారం.
దౌత్య వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా, ఇరాన్కు చెందిన సాంకేతిక బృందాల మధ్య జరిగే తదుపరి సమావేశానికి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ను ప్రాధాన్య వేదికగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. “తదుపరి దశ చర్చలు ఇస్లామాబాద్లో జరిగే అవకాశం ఉంది. అయితే అవి జూలై 11న జరుగుతాయా? లేక ఆ తర్వాత జరుగుతాయా? అనేది ఇంకా ఖరారు కాలేదు” అని ఆయన తెలిపారు. ఇరు దేశాల షెడ్యూల్ను బట్టి తేదీని ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Also Read
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రక్రియలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. వాషింగ్టన్, టెహ్రాన్లతో పాటు సంబంధిత దౌత్య ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఏర్పడిన చర్చల వాతావరణాన్ని కొనసాగించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే సమావేశంలో ఇప్పటికీ పరిష్కారం కాని కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, స్తంభింపజేసిన (Frozen) ఇరాన్ ఆస్తుల విడుదల, ఇరాన్ అణు కార్యక్రమ భవిష్యత్, విస్తృత శాంతి ఒప్పందానికి అవసరమైన దౌత్య చర్యలు వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశముందని దౌత్య వర్గాలు తెలిపాయి.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు ఇతర ప్రముఖుల అంత్యక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందం కూర్పుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. జూలై 9న అంత్యక్రియలు ముగిసిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తదుపరి దశ అమెరికా-ఇరాన్ చర్చల తేదీ లేదా వేదికపై ఇప్పటివరకు అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పాకిస్థాన్ కూడా తాము ఆతిథ్యం ఇస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్లామాబాద్నే ప్రాధాన్య వేదికగా పరిగణిస్తున్నట్లు దౌత్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమావేశం పాకిస్థాన్లో జరిగితే అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చల్లో ఇస్లామాబాద్ మరోసారి కీలక పాత్ర పోషించినట్లవుతుంది.
- Tags
- Iran
- Islamabad talks
- Pakistan
- us
తాజావార్తలు
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
-
Ariyana Glory : హిజ్రాలపై అరియానా గ్లోరి సంచలన వ్యాఖ్యలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!