US-Iran War: హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణ.. యూఎస్-ఇరాన్ చర్చలు..!
- హార్ముజ్ కేంద్రంగా ఇరాన్ యూఎస్ మధ్య చర్చలు..?
- హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణకు యూఎస్ ఓకే..
- యాక్సియోస్ నివేదికలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధ ప్రాధాన్యత మారింది. ఇన్నాళ్లు ఇరాన్లో పాలనా మార్పు తీసుకురావాలని, ఎన్రిచ్ యురేనియాన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ భావించాడు. అయితే, అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మరోవైపు, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఇంధన రవాణాకు కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇప్పుడు అమెరికా చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
హార్ముజ్ తిరిగి తెరవడానికి బదులుగా కాల్పుల విరమణకు అంగీకరించేలా ఒప్పందం గురించి అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతున్నట్లు యాక్సియోస్ నివేదిక వెల్లడించింది. బుధవారం సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్, కాల్పుల విరమణ గురించి చర్చించినట్లు నివేదిక పేర్కొంది. అంతకుముందు ట్రూత్ సోషల్లో కీలక పోస్ట్ పెట్టిన ట్రంప్.. హార్ముజ్ జలసంధి తెరిచి, నౌకాయానాన్ని స్వేచ్చగా అనుమతించినప్పుడు మాత్రమే కాల్పుల విరమణ జరుగుతుందని స్పష్టం చేశారు.
Also Read
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
Read Also: IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే
‘‘హార్ముజ్ జలసంధి తెరిచి ఉన్నప్పుడే కాల్పుల విరమణ పరిశీలిస్తాము, అప్పటి వరకు మేము ఇరాన్ను నాశనం చేస్తాము, రాతియుగానికి పంపుతాము’’ అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే, చర్చల ప్రక్రియను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఇవన్నీ నిరాధారణమైన నివేదికలుగా తోసిపుచ్చింది. టెహ్రాన్ కాల్పుల విరమణకు అంగీకరించకపోయినా, ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదని తనకు నమ్మకం కలిగితే, రెండు మూడు వారాల్లో యుద్ధం నుండి వైదొలుగుతామని మంగళవారం అన్నారు.
చర్చల గురించిన వివరాలు తెలిసిన వారు చెబుతున్నదాని ప్రకారం.. ఇప్పటికే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇరాన్ మధ్యవర్తులతో మాట్లాడినట్లు చెప్పారు. ట్రంప్ అసహనంగా ఉన్నారని, ఒక వేళ ఇరాన్ డీల్ చేసుకోకపోతే ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు పెరుగుతాయనే సందేశాన్ని ఇచ్చారు. కొన్ని డిమాండ్లు నెరవేరితే కాల్పుల విరమణకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేయాల్సిందిగా జేడీ వాన్స్ను ట్రంప్ ఆదేశించారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. అమెరికాతో దౌత్యపరమైన చర్చల్ని తోసిపుచ్చారు. ఇరు దేశాల మధ్య విశ్వాసం లేదని, అమెరికా చర్యల్లో నిజాయితీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం