Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- అమెరికా డ్రోన్ కంపెనీతో పాకిస్తాన్ సైన్యం ఒప్పందం..
- ట్రంప్ కుమారులకు ఈ కంపెనీలో పెట్టుబడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ సైన్యం, అమెరికాకు చెందిన డ్రోన్ కంపెనీ ‘పవరస్’’తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్లకు సంబంధించిన ఆర్డర్లతో పాటు, ఎంఓయూ కుదుర్చుకున్నట్లు పవరస్ కో ఫౌండర్ బ్రెట్ వెలికోవిచ్ తెలిపారు. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్తో సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ కుమారుకుల పెట్టుబడులు కలిగిన ఆరియస్ గ్రీన్వే హోల్డింగ్స్ అనే కంపెనీలో త్వరలో పవరస్ విలీనం కాబోతోంది. విలీనం తర్వాత ఏర్పడే కంపెనీలో వీరికి 9.9 బెనిఫిషియల్ ఓనర్షిఫ్ వాటా కలిగి ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ ప్రారంభంలో ఈ రెండు కంపెనీల విలీనం కాబోతున్నాయి.
పవరస్ ప్రతినిధులు బృందం బ్రెట్ వెలికోవిచ్ నేతృత్వంలో పాక్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్తో సమావేశమైనట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఈ భేటీలో రక్షణ కొనుగోళ్లు, ఉత్పత్తి, దీర్ఘకాలిక రక్షణ సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు పాక్ తెలిపింది. పవరస్ సీఈఓ ఆండ్రూ ఫాక్స్ ప్రకారం.. పాకిస్తాన్ ప్రైవేట్ రక్షణ రంగం ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, అమెరికా కంపెనీ అక్కడ వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అమెరికా-పాకిస్తాన్ సాంకేతిక సామర్థ్యాలతో జాయింట్ టెక్నికల్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని పవరస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- 43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ఇదిలా ఉంటే, పవరస్ వ్యాపార విస్తరణలో ట్రంప్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని సీఈఓ ఆండ్రూ పాక్స్ తెలిపారు. ఒప్పందాలు వ్యాపార ప్రాతిపదికన, మెరిట్ ఆధారంగా లభిస్తాయని చెప్పారు. ట్రంప్ జూనియర్ ఒక పాసివ్ ఇన్వెస్టర్ మాత్రమే అని తెలిపారు. ఇదిలా ఉంటే, ఈ ఒప్పందాన్ని అమెరికా, పాకిస్తాన్ మధ్య రక్షణ సంబంధాల బలోపేతానికి ఉపయోగపడుతుందని అసిమ్ మునీర్ ప్రశంసిొంచారు.
తాజావార్తలు
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!