United Nations: బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించిన ఐక్యరాజ్యసమితి..
- బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్లు..
- హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపిన్న అల్లరిమూకలు..
- బంగ్లాలో హిందూ మైనార్టీలపై దాడులు ఆపేయాలి: ఐక్యరాజ్య సమితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
United Nations: బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింసాకాండలో మైనారిటీలుగా ఉన్న హిందవులపై జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఈ సందర్భంగా యూఎస్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హింసను అరికట్టాలని కోరుకుంటున్నాం.. హిందూ సమాజానికి చెందిన దేవాలయాలు, వ్యాపారాలు, గృహాలను తగులబెట్టిన అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో 27 జిల్లాల్లోని హిందువులకు చెందిన వ్యాపార సంస్థల్లోని వస్తువులను దోచుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. కొన్ని అల్లరి మూకలు చేసిన దాడుల్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపినట్లు కూడా వార్తలు వచ్చాయని గుటెర్రెస్ పేర్కొన్నారు.
Read Also: Nagarjuna : నా కొడుకు సంతోషంగా ఉండు.. అదే మాకు ఆనందం : నాగార్జున
Also Read
- Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
అయితే, బంగ్లాదేశ్ లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటులో శాంతి, సమ్మిళిత ప్రక్రియ కోసం ప్రయత్నం చేస్తామని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారు. ఇంకా యూనస్తో మాట్లాడలేదని.. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తాత్కాలిక అధినేత యూనస్ పిలుపుకు మద్దతు ఇవ్వడానికి యూఎన్ కట్టుబడి ఉందని బంగ్లాదేశ్లోని ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కో- ఆర్డినేటర్ గ్విన్ లూయిస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Read Also: Hero Surya : షాకింగ్ న్యూస్… షూటింగులో హీరో సూర్య తలకి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
కాగా, బంగ్లాదేశ్ లో నిరసనల మధ్య షేక్ హసీనా తన ప్రధాన పదవికీ రాజీనామా చేయడంతో పాటు దేశం నుంచి పారిపోయిన తరువాత కూడా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్లో దాదాపు 232 మంది ప్రాణాలు కోల్పోగా.. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం మరణాల సంఖ్య 550కి చేరుకుంది. ఇక, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజావార్తలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
-
Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
-
YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్కు జిన్పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?