United Nations: బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించిన ఐక్యరాజ్యసమితి..
- బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్లు..
- హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపిన్న అల్లరిమూకలు..
- బంగ్లాలో హిందూ మైనార్టీలపై దాడులు ఆపేయాలి: ఐక్యరాజ్య సమితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
United Nations: బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింసాకాండలో మైనారిటీలుగా ఉన్న హిందవులపై జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఈ సందర్భంగా యూఎస్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హింసను అరికట్టాలని కోరుకుంటున్నాం.. హిందూ సమాజానికి చెందిన దేవాలయాలు, వ్యాపారాలు, గృహాలను తగులబెట్టిన అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో 27 జిల్లాల్లోని హిందువులకు చెందిన వ్యాపార సంస్థల్లోని వస్తువులను దోచుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. కొన్ని అల్లరి మూకలు చేసిన దాడుల్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపినట్లు కూడా వార్తలు వచ్చాయని గుటెర్రెస్ పేర్కొన్నారు.
Read Also: Nagarjuna : నా కొడుకు సంతోషంగా ఉండు.. అదే మాకు ఆనందం : నాగార్జున
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
అయితే, బంగ్లాదేశ్ లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటులో శాంతి, సమ్మిళిత ప్రక్రియ కోసం ప్రయత్నం చేస్తామని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారు. ఇంకా యూనస్తో మాట్లాడలేదని.. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తాత్కాలిక అధినేత యూనస్ పిలుపుకు మద్దతు ఇవ్వడానికి యూఎన్ కట్టుబడి ఉందని బంగ్లాదేశ్లోని ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కో- ఆర్డినేటర్ గ్విన్ లూయిస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Read Also: Hero Surya : షాకింగ్ న్యూస్… షూటింగులో హీరో సూర్య తలకి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
కాగా, బంగ్లాదేశ్ లో నిరసనల మధ్య షేక్ హసీనా తన ప్రధాన పదవికీ రాజీనామా చేయడంతో పాటు దేశం నుంచి పారిపోయిన తరువాత కూడా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్లో దాదాపు 232 మంది ప్రాణాలు కోల్పోగా.. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం మరణాల సంఖ్య 550కి చేరుకుంది. ఇక, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!