Russia-Ukraine War: “చలి”ని ఆయుధంగా చేసుకుంటున్న రష్యా.. జెలెన్ స్కీ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine’s Zelensky Says Russia Using Cold As “Weapon Of Mass Destruction”: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తొమ్మిదో నెలకు చేరుకుంది. అయినా కూడా రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రష్యా, ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, ఆయుధ, సైనిక సహకారంతో ఉక్రెయిన్ బలమైన రష్యాను ఎదురించి పోరాడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహ ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఖేర్సన్, ఎల్వీవ్ వంటి నగరాలను లక్ష్యంగా చేసుకుంటూ రష్యా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఈ నగరాల్లోని మౌళిక సదుపాయాలను ధ్వంసం చేస్తోంది. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను నాశనం చేస్తోంది రష్యా.
Read Also: Earthquake: మహారాష్ట్ర నాసిక్లో భూకంపం..
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ రష్యాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రష్యా చలిని ‘సామూహిక విధ్వంస ఆయుధం’గా చేసుకుంటుందని ఆరోపించారు జెలన్ స్కీ. ఉక్రెయిన్ మౌళిక సదుపాయాలను దెబ్బతీయడం ద్వారా చలికి ప్రజలు చనిపోయేలా చేస్తోందని ఆయన మంగళవారం అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో చలికాలం ప్రారంభం అయింది. ప్రజలు తమ ఇళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు విద్యుత్ అవసరం అయితే ఆ విద్యుత్ వ్యవస్థనే టార్గెట్ చేస్తోంది రష్యా. దీని వల్ల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తోంది. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేలా చేయడమే రష్యా ఉద్దేశ్యం అని గతంలో జెలన్ స్కీ ఆరోపించారు.
ఈ శీతాకాలంలో ఉక్రెయిన్ మనుగడ సాధించాలంటే తమకు చాలా మద్దతు అవసరం అని పాశ్చాత్య దేశాలను, మిత్రదేశాలను కోరుతున్నారు జెలన్ స్కీ. ఉక్రెయిన్ అత్యవసర సేవల కోసం జనరేటర్లు, ఇతర పరికాలను పంపాలను ఫ్రెంచ్ మేయర్లతో జెలన్ స్కీ కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. రష్యా దాడులతో దేశంలోని పవర్ గ్రిడ్స్ కుప్పకూలుతుండటంతో మిలియన్ల మంది ఉక్రెయిన్ల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం హెచ్చరించింది. రష్యా ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడంతో దేశంలోని చాలా చోట్ల కరెంట్ లేకుండా పోయింది.
- Tags
తాజావార్తలు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!