Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్
- ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు
- మధ్యప్రాచ్యం స్వర్ణయుగం కాబోతుందన్న ట్రంప్
- స్వాగతించిన ఐరాస, ప్రపంచ దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ శాంతికి ఈరోజు గొప్ప రోజు అని.. ఇకపై అన్ని సానుకూల చర్యలే ఉంటాయని అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. యుద్ధంతో ఇరాన్కు విసుగొచ్చిందని.. ఇప్పుడు శాంతి కోరుకుంటోందని తెలిపారు. మిగతా దేశాలకూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇరాన్ తిరిగి పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చని.. పరిస్థితి సజావుగా సాగేందుకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తామన్నారు. అన్నీ బాగానే జరుగుతాయని నమ్మకం ఉందని… అమెరికాలో మాదిరిగానే మధ్యప్రాచ్యానికి కూడా స్వర్ణయుగం రాబోతుంది.” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
‘‘ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు! ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది! అలాగే మిగతా అందరికీ కూడా! హార్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించడంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సహాయం చేస్తుంది. ఎన్నో సానుకూల చర్యలు ఉంటాయి! భారీగా డబ్బు సంపాదించవచ్చు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. మేము అన్ని రకాల సామాగ్రిని సిద్ధం చేసుకుని.. అంతా సవ్యంగా జరిగేలా చూసుకోవడానికి అక్కడే ఉంటాం. అది జరుగుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అమెరికాలో మనం అనుభవిస్తున్నట్లే.. ఇది మధ్యప్రాచ్యానికి స్వర్ణయుగం కావచ్చు!!!’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నారు.
ఐరాస స్వాగతం..
ఇక రెండు వారాల అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతించారు. మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక శాంతి కోసం అన్ని పక్షాలు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇజ్రాయెల్ మద్దతు
ఇరాన్పై బాంబు దాడులను నిలిపివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని ఇజ్రాయెల్ బుధవారం తెలిపింది, అయితే చివరి నిమిషంలో కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ చేరలేదని స్పష్టం చేసింది. లెబనాన్పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో చర్చల కోసం రెండు వారాల విరామాన్ని ఉపయోగించుకుంటామని టెహ్రాన్ ప్రకటించింది. పాకిస్థాన్లో శుక్రవారం చర్చలు ప్రారంభం కానున్నాయి.

తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..