Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్
- ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు
- మధ్యప్రాచ్యం స్వర్ణయుగం కాబోతుందన్న ట్రంప్
- స్వాగతించిన ఐరాస, ప్రపంచ దేశాలు
ప్రపంచ శాంతికి ఈరోజు గొప్ప రోజు అని.. ఇకపై అన్ని సానుకూల చర్యలే ఉంటాయని అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. యుద్ధంతో ఇరాన్కు విసుగొచ్చిందని.. ఇప్పుడు శాంతి కోరుకుంటోందని తెలిపారు. మిగతా దేశాలకూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇరాన్ తిరిగి పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చని.. పరిస్థితి సజావుగా సాగేందుకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తామన్నారు. అన్నీ బాగానే జరుగుతాయని నమ్మకం ఉందని… అమెరికాలో మాదిరిగానే మధ్యప్రాచ్యానికి కూడా స్వర్ణయుగం రాబోతుంది.” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
‘‘ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు! ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది! అలాగే మిగతా అందరికీ కూడా! హార్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించడంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సహాయం చేస్తుంది. ఎన్నో సానుకూల చర్యలు ఉంటాయి! భారీగా డబ్బు సంపాదించవచ్చు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. మేము అన్ని రకాల సామాగ్రిని సిద్ధం చేసుకుని.. అంతా సవ్యంగా జరిగేలా చూసుకోవడానికి అక్కడే ఉంటాం. అది జరుగుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అమెరికాలో మనం అనుభవిస్తున్నట్లే.. ఇది మధ్యప్రాచ్యానికి స్వర్ణయుగం కావచ్చు!!!’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నారు.
ఐరాస స్వాగతం..
ఇక రెండు వారాల అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతించారు. మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక శాంతి కోసం అన్ని పక్షాలు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇజ్రాయెల్ మద్దతు
ఇరాన్పై బాంబు దాడులను నిలిపివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని ఇజ్రాయెల్ బుధవారం తెలిపింది, అయితే చివరి నిమిషంలో కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ చేరలేదని స్పష్టం చేసింది. లెబనాన్పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో చర్చల కోసం రెండు వారాల విరామాన్ని ఉపయోగించుకుంటామని టెహ్రాన్ ప్రకటించింది. పాకిస్థాన్లో శుక్రవారం చర్చలు ప్రారంభం కానున్నాయి.

తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో