Trump: రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే భారత్కు 500 శాతం సుంకాలు విధిస్తాం.. ట్రంప్ హెచ్చరికలు
- రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే భారత్కు 500 శాతం సుంకాలు విధిస్తాం
- డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మిత్ర దేశాలను కూడా శత్రు దేశాలుగా మార్చుకుంటున్నారు. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించి తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేకపోయింది. నిత్యం అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేస్తోంది. ఈ విషయం ట్రంప్కు రుచించడం లేదు. దీంతో రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యాను కంట్రోల్లోకి తేవాలంటే దాని మిత్ర దేశాలపై 500 శాతం సుంకాలు విధించాలని కేబినెట్ సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Nimisha Priya Case: మరో రెండు రోజుల్లో ఉరిశిక్ష.. సుప్రీంకోర్టుకు చేరిన నిమిషా ప్రియా కేసు..
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
రష్యాను కంట్రోల్లోకి తెచ్చేందుకు దాని మిత్ర దేశాలపై దెబ్బ కొట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ఇంధనాన్ని కొలుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించాలని ప్రణాళిక రచిస్తు్న్నారు. రష్యా మిత్ర దేశాలపై 500 శాతం సుంకాలను ప్రతిపాదించే అమెరికా సెనేట్ బిల్లుకు ట్రంప్ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సెనేటర్ లిండ్సే గ్రాహం బిల్లును తీసుకొచ్చారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు ఆపేందుకే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అని సమాచారం.
ఇది కూడా చదవండి: PVN Madhav: చాగంటితో భేటీ.. కాకినాడ ప్రవచన రాజధానిగా మారిందన్న మాధవ్..
రష్యా ఇంధనాన్ని భారత్, చైనా కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యలో భారత్, చైనాలపై భారీగా 500 శాతం సుంకాలను విధించాలని ట్రంప్ సూచించినట్లు సమాచారం. అదే జరిగితే భారత్పై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
రష్యాపై నిషేధం విధించే బిల్లును ట్రంప్ సన్నిహిత మిత్రుడు సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే 84 మంది సహ-స్పాన్సర్ల మద్దతు ఉంది. ఉక్రెయిన్పై రష్యా క్రూరమైన దాడి ఆపాలంటూ మిత్ర దేశాలైన చైనా, భారతదేశంపై సుంకాల పేరుతో ఒత్తిడి తీసుకురావడమే మార్గమని గ్రాహం అన్నారు. బిల్లు ఆమోదం పొందుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ఇటీవల వాషింగ్టన్ను సందర్శించిన సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును భారతదేశం నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. ఇంధన భద్రతపై భారతదేశం ఆందోళనలను తెలియజేయడానికి భారత రాయబార కార్యాలయం, రాయబారి సెనేటర్ గ్రాహంతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.
- Tags
- 500% tariffs
- america
- china
- india
- Russia
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!