Trump: రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే భారత్కు 500 శాతం సుంకాలు విధిస్తాం.. ట్రంప్ హెచ్చరికలు
- రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే భారత్కు 500 శాతం సుంకాలు విధిస్తాం
- డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మిత్ర దేశాలను కూడా శత్రు దేశాలుగా మార్చుకుంటున్నారు. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించి తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేకపోయింది. నిత్యం అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేస్తోంది. ఈ విషయం ట్రంప్కు రుచించడం లేదు. దీంతో రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యాను కంట్రోల్లోకి తేవాలంటే దాని మిత్ర దేశాలపై 500 శాతం సుంకాలు విధించాలని కేబినెట్ సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Nimisha Priya Case: మరో రెండు రోజుల్లో ఉరిశిక్ష.. సుప్రీంకోర్టుకు చేరిన నిమిషా ప్రియా కేసు..
Also Read
- Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
- Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
రష్యాను కంట్రోల్లోకి తెచ్చేందుకు దాని మిత్ర దేశాలపై దెబ్బ కొట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ఇంధనాన్ని కొలుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించాలని ప్రణాళిక రచిస్తు్న్నారు. రష్యా మిత్ర దేశాలపై 500 శాతం సుంకాలను ప్రతిపాదించే అమెరికా సెనేట్ బిల్లుకు ట్రంప్ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సెనేటర్ లిండ్సే గ్రాహం బిల్లును తీసుకొచ్చారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు ఆపేందుకే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అని సమాచారం.
ఇది కూడా చదవండి: PVN Madhav: చాగంటితో భేటీ.. కాకినాడ ప్రవచన రాజధానిగా మారిందన్న మాధవ్..
రష్యా ఇంధనాన్ని భారత్, చైనా కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యలో భారత్, చైనాలపై భారీగా 500 శాతం సుంకాలను విధించాలని ట్రంప్ సూచించినట్లు సమాచారం. అదే జరిగితే భారత్పై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
రష్యాపై నిషేధం విధించే బిల్లును ట్రంప్ సన్నిహిత మిత్రుడు సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే 84 మంది సహ-స్పాన్సర్ల మద్దతు ఉంది. ఉక్రెయిన్పై రష్యా క్రూరమైన దాడి ఆపాలంటూ మిత్ర దేశాలైన చైనా, భారతదేశంపై సుంకాల పేరుతో ఒత్తిడి తీసుకురావడమే మార్గమని గ్రాహం అన్నారు. బిల్లు ఆమోదం పొందుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ఇటీవల వాషింగ్టన్ను సందర్శించిన సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును భారతదేశం నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. ఇంధన భద్రతపై భారతదేశం ఆందోళనలను తెలియజేయడానికి భారత రాయబార కార్యాలయం, రాయబారి సెనేటర్ గ్రాహంతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.
- Tags
- 500% tariffs
- america
- china
- india
- Russia
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!