Nimisha Priya Case: మరో రెండు రోజుల్లో ఉరిశిక్ష.. సుప్రీంకోర్టుకు చేరిన నిమిషా ప్రియా కేసు..
- యెమెన్లో ఉరికంబం ఎక్కబోతున్న నిమిషా ప్రియా..
- ఉరి శిక్షకు రెండు రోజుల ముందు సుప్రీంకోర్టులో విచారణ..
- కేరళ నర్సును రక్షించేందుకు చర్యలు..
- బాధిత కుటుంబం ‘‘బ్లడ్ మనీ’’కి అంగీకరిస్తే శిక్ష నుంచి ఉపశమనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimisha Priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబం ఎక్కబోతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ప్రస్తుతం నిమిషా ప్రియా కేసు భారత సుప్రీంకోర్టుకు చేరింది. ఉరిశిక్షకు రెండు రోజుల ముందు అంటే, జూలై 14న అత్యవసరంగా పిటిషన్ను విచారించనుంది. ఉరిశిక్షను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది.
జూలై 16న జరగనున్న ఆమె ఉరిశిక్షపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ అత్యవసరంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన బెంచ్ ముందు ఈ విషయం అత్యవసరంగా ప్రస్తావించబడింది. షరియా చట్టాల ప్రకారం, ‘‘బ్లడ్ మనీ’’ కింద బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే, వారు క్షమాభిక్ష పెడితే నిమిషా ప్రియాను రక్షించవచ్చనే సమాచారం ఇప్పటికే సుప్రీంకోర్టుకు అందింది.
Also Read
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
READ ALSO: Bhahubali : ‘బాహుబలి’ రీరిలీజ్పై జక్కన్న గ్రాండ్ అప్డేట్..
దౌత్య మార్గాల ద్వారా ఆమె విడుదలపై చర్చలు జరపడానికి కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని కోరుతూ “సేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్” ఈ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఆ వ్యక్తికి మరణశిక్ష ఎందుకు విధించారని జస్టిస్ ధులియా ప్రశ్నించారు. స్థానిక వ్యక్తి ఆమెను హింసించడం ప్రారంభించాడని, ఆమె అనుకోని పరిస్థితుల్లో చంపేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిమిషా తన పాస్పోర్టు పొందేందుకు మెహదీకి మత్తు మందు ఇవ్వడం, అది విషమించడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
“సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్” 2022లో హైకోర్టును ఆశ్రయించింది. “నిమిషా ప్రియ తరపున దౌత్యపరమైన జోక్యాలను సులభతరం చేయడంతో పాటు బాధితురాలి కుటుంబంతో చర్చలు జరపాలని, అక్కడి చట్టానికి అనుగుణంగా కాలపరిమితిలో బ్లడ్ మనీ చెల్లించడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడాలని” కేంద్రాన్ని వేడుకుంది. అయితే, ప్రియాను కాపాడటానికి బ్లడ్ మనీపై చర్చించమని కేంద్రానికి ఆదేశం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే, ఆమె శిక్షకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!