Nimisha Priya Case: మరో రెండు రోజుల్లో ఉరిశిక్ష.. సుప్రీంకోర్టుకు చేరిన నిమిషా ప్రియా కేసు..
- యెమెన్లో ఉరికంబం ఎక్కబోతున్న నిమిషా ప్రియా..
- ఉరి శిక్షకు రెండు రోజుల ముందు సుప్రీంకోర్టులో విచారణ..
- కేరళ నర్సును రక్షించేందుకు చర్యలు..
- బాధిత కుటుంబం ‘‘బ్లడ్ మనీ’’కి అంగీకరిస్తే శిక్ష నుంచి ఉపశమనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimisha Priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబం ఎక్కబోతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ప్రస్తుతం నిమిషా ప్రియా కేసు భారత సుప్రీంకోర్టుకు చేరింది. ఉరిశిక్షకు రెండు రోజుల ముందు అంటే, జూలై 14న అత్యవసరంగా పిటిషన్ను విచారించనుంది. ఉరిశిక్షను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది.
జూలై 16న జరగనున్న ఆమె ఉరిశిక్షపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ అత్యవసరంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన బెంచ్ ముందు ఈ విషయం అత్యవసరంగా ప్రస్తావించబడింది. షరియా చట్టాల ప్రకారం, ‘‘బ్లడ్ మనీ’’ కింద బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే, వారు క్షమాభిక్ష పెడితే నిమిషా ప్రియాను రక్షించవచ్చనే సమాచారం ఇప్పటికే సుప్రీంకోర్టుకు అందింది.
Also Read
- Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
- UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
READ ALSO: Bhahubali : ‘బాహుబలి’ రీరిలీజ్పై జక్కన్న గ్రాండ్ అప్డేట్..
దౌత్య మార్గాల ద్వారా ఆమె విడుదలపై చర్చలు జరపడానికి కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని కోరుతూ “సేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్” ఈ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఆ వ్యక్తికి మరణశిక్ష ఎందుకు విధించారని జస్టిస్ ధులియా ప్రశ్నించారు. స్థానిక వ్యక్తి ఆమెను హింసించడం ప్రారంభించాడని, ఆమె అనుకోని పరిస్థితుల్లో చంపేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిమిషా తన పాస్పోర్టు పొందేందుకు మెహదీకి మత్తు మందు ఇవ్వడం, అది విషమించడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
“సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్” 2022లో హైకోర్టును ఆశ్రయించింది. “నిమిషా ప్రియ తరపున దౌత్యపరమైన జోక్యాలను సులభతరం చేయడంతో పాటు బాధితురాలి కుటుంబంతో చర్చలు జరపాలని, అక్కడి చట్టానికి అనుగుణంగా కాలపరిమితిలో బ్లడ్ మనీ చెల్లించడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడాలని” కేంద్రాన్ని వేడుకుంది. అయితే, ప్రియాను కాపాడటానికి బ్లడ్ మనీపై చర్చించమని కేంద్రానికి ఆదేశం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే, ఆమె శిక్షకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజావార్తలు
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!