పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చబోతోందా? మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధం ముందు.. ముందు మరింత ఉద్రిక్తతలకు దారి తీయబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
రంజాన్ వేళ ఇరాన్తో యుద్ధం వేళ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై తమ లక్ష్యం నెరవేరిందని.. యుద్ధం కూడా ముగియబోతోందని ట్రంప్ కీలక సంకేతం ఇచ్చారు. తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా దగ్గరగా ఉన్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు.