Iran – Israel War: నా మాటలను ఇరాన్ పట్టించుకోలేదు.. .. ఇరాన్ దాడులపై ట్రంప్ తొలి రియాక్షన్
- చర్చలపై సంతృప్తిగా లేనని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే దాడులు..
- నా మాటల్ని ఇరాన్ పట్టించుకోవడం లేదంటున్న డొనాల్డ్ ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Isreal War: ఇరాన్ మీద దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించాడు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుంది అని ఆరోపించాడు. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టింది.. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు ఈ దాడులు చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే ఈ దాడులు చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించాడు.
Read Also: VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!
Also Read
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇరాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.. కానీ ఇరాన్కు అణు ఆయుధాలు ఉండకూడదు అనే విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ వారం మొత్తం చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. తాను ఇరాన్పై సైనిక చర్యలకు వెళ్లాలని కోరుకోవడం లేదు.. కానీ కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితులు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో భారీగా దాడులు జరిగాయి. ఇజ్రాయెల్- యూఎస్ సంయుక్తంగా కలిసి క్షిపణులతో దాడులు చేశాయి.
Read Also: Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..
మరోవైపు, ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా క్షిపణి దాడులు చేసింది. షీల్డ్ ఆఫ్ జూద్ పేరుతో ఆపరేషన్ చేపట్టగా, 30 ప్రాంతాలను టార్గెట్ చేసింది. నార్త్, ఈస్ట్ టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ తమ పౌరులను హెచ్చరించింది. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే దాడులు చేసినట్లు ప్రకటించింది. అలాగే, ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ ని కూడా మూసివేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్- అమెరియా జాయింట్ ఆపరేషన్ తో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!