Site icon NTV Telugu

Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..

Trump

Trump

Donald Trump: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నాడు. ‘‘మీరు (భారత్, పాక్) ఘర్షణ పడితే ప్రతీ దేశంపై 200 శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పాను. డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తే మనం పోరాడాలని అనుకోము’’ అని అమెరికా అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశంలో అన్నారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ , పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని ట్రంప్ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. అయితే, కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

Read Also: Zimbabwe vs Sri Lanka: శ్రీలంక గడ్డపై జింబాబ్వే సంచలనం విజయం.. టేబుల్ టాపర్‌గా రజా సేన

‘‘ యుద్ధం జోరుగా సాగుతోంది. విమానాలు కూలిపోతున్నాయి. 11 జెట్లు కూలిపోయాయి. చాలా ఖరీదైన జెట్లు. నేను వారిద్దరితో ఫోన్‌లో మాట్లాడాను. నాకు ప్రధాని మోడీ బాగా తెలుసు. నా మాట వినకుంటే మీ ఇద్దరితో (భారత్, పాక్)తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోనని చెప్పా’’ అని ట్రంప్ అన్నారు. తన ఫోన్ కాల్స్ వల్లే ఉద్రిక్తతలు తగ్గాయని మోడీ, షెహబాజ్ షరీఫ్‌లో మాట్లాడి ఒప్పందం కుదిర్చానని అన్నారు. 25 మిలియన్ల మంది ప్రాణాలు కాపాడినందుకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తనను అభినందించారని ట్రంప్ చెప్పుకొచ్చారు.

Exit mobile version