Israel-Lebanon: బీరుట్లో ఇజ్రాయెల్ దాడి.. 8 మంది మృతి
- బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడి
- 8 మంది మృతి.. 59 మందికి గాయాలు
- చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదట పేజర్ పేలుడు, ఆ తర్వాత రేడియో సెట్లు.. వాకీ టాకీల పేలుడు ఘటనల అనంతరం.. ఇజ్రాయెల్ సైన్యం వరుసగా రెండవ రోజు హిజ్బుల్లాపై వైమానిక దాడులను కొనసాగించింది. ఒక నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ సైన్యం స్వయంగా ఈ సమాచారం తెలిపింది. బీరుట్లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తమ వైపు నుండి దాడి చేశామని పేర్కొంది. ఈ దాడి వివరాలను లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలుపుతూ.. బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడిలో 8 మంది చనిపోయారు.. 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు ఉన్నాడు. కాగా.. ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే..
Read Also: Asteroid: భూమికి సమీపంగా వస్తున్న గ్రహశకలం.. నాసా ఏం చెబుతుందంటే..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
హిజ్బుల్లాపై గత నాలుగు రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గత మంగళవారం.. లెబనాన్లోని హిజ్బుల్లా యోధులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్న వేలాది టెలిఫోన్లను ధ్వంసం చేశారు. పేజర్ పేలుడులో చాలా మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. బుధవారం రేడియో సెట్లు, వాకీ-టాకీలతో కూడిన పేలుళ్లలో చాలా మంది యోధులు మరణించారు. సమాచారం ప్రకారం, ఈ రెండు పేలుళ్లలో 30 మందికి పైగా మరణించగా.. 3000 మందికి పైగా గాయపడ్డారు.
Read Also: Jalavihar : జలవిహార్పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు..
ఈ పరికరాల పేలుడుకు ఇజ్రాయెల్ కారణమని హిజ్బుల్లా తెలిపింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై హిజ్బుల్లా చేసిన దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ ఆర్మీ సైనికులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. హిజ్బుల్లాపై తన దాడులను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో లెబనాన్ సరిహద్దుల్లో సైనికుల మోహరింపును ఇజ్రాయెల్ పెంచింది. అదే సమయంలో.. పరికరాల పేలుడు గురించి హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ను బెదిరించారు. హిజ్బుల్లా బెదిరింపులకు తాము భయపడమని, హిజ్బుల్లా దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!