Israel-Lebanon: బీరుట్లో ఇజ్రాయెల్ దాడి.. 8 మంది మృతి
- బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడి
- 8 మంది మృతి.. 59 మందికి గాయాలు
- చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదట పేజర్ పేలుడు, ఆ తర్వాత రేడియో సెట్లు.. వాకీ టాకీల పేలుడు ఘటనల అనంతరం.. ఇజ్రాయెల్ సైన్యం వరుసగా రెండవ రోజు హిజ్బుల్లాపై వైమానిక దాడులను కొనసాగించింది. ఒక నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ సైన్యం స్వయంగా ఈ సమాచారం తెలిపింది. బీరుట్లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తమ వైపు నుండి దాడి చేశామని పేర్కొంది. ఈ దాడి వివరాలను లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలుపుతూ.. బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడిలో 8 మంది చనిపోయారు.. 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు ఉన్నాడు. కాగా.. ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే..
Read Also: Asteroid: భూమికి సమీపంగా వస్తున్న గ్రహశకలం.. నాసా ఏం చెబుతుందంటే..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
హిజ్బుల్లాపై గత నాలుగు రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గత మంగళవారం.. లెబనాన్లోని హిజ్బుల్లా యోధులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్న వేలాది టెలిఫోన్లను ధ్వంసం చేశారు. పేజర్ పేలుడులో చాలా మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. బుధవారం రేడియో సెట్లు, వాకీ-టాకీలతో కూడిన పేలుళ్లలో చాలా మంది యోధులు మరణించారు. సమాచారం ప్రకారం, ఈ రెండు పేలుళ్లలో 30 మందికి పైగా మరణించగా.. 3000 మందికి పైగా గాయపడ్డారు.
Read Also: Jalavihar : జలవిహార్పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు..
ఈ పరికరాల పేలుడుకు ఇజ్రాయెల్ కారణమని హిజ్బుల్లా తెలిపింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై హిజ్బుల్లా చేసిన దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ ఆర్మీ సైనికులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. హిజ్బుల్లాపై తన దాడులను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో లెబనాన్ సరిహద్దుల్లో సైనికుల మోహరింపును ఇజ్రాయెల్ పెంచింది. అదే సమయంలో.. పరికరాల పేలుడు గురించి హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ను బెదిరించారు. హిజ్బుల్లా బెదిరింపులకు తాము భయపడమని, హిజ్బుల్లా దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ చెప్పారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!