Israel-Lebanon: బీరుట్లో ఇజ్రాయెల్ దాడి.. 8 మంది మృతి
- బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడి
- 8 మంది మృతి.. 59 మందికి గాయాలు
- చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదట పేజర్ పేలుడు, ఆ తర్వాత రేడియో సెట్లు.. వాకీ టాకీల పేలుడు ఘటనల అనంతరం.. ఇజ్రాయెల్ సైన్యం వరుసగా రెండవ రోజు హిజ్బుల్లాపై వైమానిక దాడులను కొనసాగించింది. ఒక నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ సైన్యం స్వయంగా ఈ సమాచారం తెలిపింది. బీరుట్లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తమ వైపు నుండి దాడి చేశామని పేర్కొంది. ఈ దాడి వివరాలను లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలుపుతూ.. బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడిలో 8 మంది చనిపోయారు.. 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు ఉన్నాడు. కాగా.. ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే..
Read Also: Asteroid: భూమికి సమీపంగా వస్తున్న గ్రహశకలం.. నాసా ఏం చెబుతుందంటే..
Also Read
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
- Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్రౌండర్లు ఒకేసారి అవుట్..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
హిజ్బుల్లాపై గత నాలుగు రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గత మంగళవారం.. లెబనాన్లోని హిజ్బుల్లా యోధులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్న వేలాది టెలిఫోన్లను ధ్వంసం చేశారు. పేజర్ పేలుడులో చాలా మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. బుధవారం రేడియో సెట్లు, వాకీ-టాకీలతో కూడిన పేలుళ్లలో చాలా మంది యోధులు మరణించారు. సమాచారం ప్రకారం, ఈ రెండు పేలుళ్లలో 30 మందికి పైగా మరణించగా.. 3000 మందికి పైగా గాయపడ్డారు.
Read Also: Jalavihar : జలవిహార్పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు..
ఈ పరికరాల పేలుడుకు ఇజ్రాయెల్ కారణమని హిజ్బుల్లా తెలిపింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై హిజ్బుల్లా చేసిన దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ ఆర్మీ సైనికులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. హిజ్బుల్లాపై తన దాడులను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో లెబనాన్ సరిహద్దుల్లో సైనికుల మోహరింపును ఇజ్రాయెల్ పెంచింది. అదే సమయంలో.. పరికరాల పేలుడు గురించి హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ను బెదిరించారు. హిజ్బుల్లా బెదిరింపులకు తాము భయపడమని, హిజ్బుల్లా దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ చెప్పారు.
తాజావార్తలు
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్రౌండర్లు ఒకేసారి అవుట్..
-
Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
-
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్కు రెడీగా ఉండండి!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!