Israel-Lebanon: బీరుట్లో ఇజ్రాయెల్ దాడి.. 8 మంది మృతి
- బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడి
- 8 మంది మృతి.. 59 మందికి గాయాలు
- చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదట పేజర్ పేలుడు, ఆ తర్వాత రేడియో సెట్లు.. వాకీ టాకీల పేలుడు ఘటనల అనంతరం.. ఇజ్రాయెల్ సైన్యం వరుసగా రెండవ రోజు హిజ్బుల్లాపై వైమానిక దాడులను కొనసాగించింది. ఒక నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ సైన్యం స్వయంగా ఈ సమాచారం తెలిపింది. బీరుట్లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తమ వైపు నుండి దాడి చేశామని పేర్కొంది. ఈ దాడి వివరాలను లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలుపుతూ.. బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడిలో 8 మంది చనిపోయారు.. 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు ఉన్నాడు. కాగా.. ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే..
Read Also: Asteroid: భూమికి సమీపంగా వస్తున్న గ్రహశకలం.. నాసా ఏం చెబుతుందంటే..
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
హిజ్బుల్లాపై గత నాలుగు రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గత మంగళవారం.. లెబనాన్లోని హిజ్బుల్లా యోధులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్న వేలాది టెలిఫోన్లను ధ్వంసం చేశారు. పేజర్ పేలుడులో చాలా మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. బుధవారం రేడియో సెట్లు, వాకీ-టాకీలతో కూడిన పేలుళ్లలో చాలా మంది యోధులు మరణించారు. సమాచారం ప్రకారం, ఈ రెండు పేలుళ్లలో 30 మందికి పైగా మరణించగా.. 3000 మందికి పైగా గాయపడ్డారు.
Read Also: Jalavihar : జలవిహార్పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు..
ఈ పరికరాల పేలుడుకు ఇజ్రాయెల్ కారణమని హిజ్బుల్లా తెలిపింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై హిజ్బుల్లా చేసిన దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ ఆర్మీ సైనికులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. హిజ్బుల్లాపై తన దాడులను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో లెబనాన్ సరిహద్దుల్లో సైనికుల మోహరింపును ఇజ్రాయెల్ పెంచింది. అదే సమయంలో.. పరికరాల పేలుడు గురించి హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ను బెదిరించారు. హిజ్బుల్లా బెదిరింపులకు తాము భయపడమని, హిజ్బుల్లా దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ చెప్పారు.
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!