Iran: ఇరాన్లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
- ఇరాన్లో ముగ్గురు భారతీయులు అదృశ్యం
- ఆందోళనలో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బతుకుదెరువు కోసం ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. దీంతో వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ బిడ్డల జాడ గుర్తించాలని ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు.
ఇది కూడా చదవండి: Yuva Galam Padayatra Book: గత ప్రభుత్వ అరాచక పాలనపై పుస్తకం.. సీఎంకు అందజేసిన నారా లోకేష్
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
అదృశ్యమైన వ్యక్తులు పంజాబ్కు చెందిన హుషన్ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్పూర్)గా గుర్తించారు. హోషియార్పూర్ ఏజెంట్ సాయంతో మే 1న ఇరాన్ వెళ్లారు. ఇరాన్లోకి అడుగుపెట్టగానే దుండగులు బంధించి వాళ్లను తాళ్లతో కట్టి.. కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మే 11 నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో టెహ్రాన్లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు. దీంతో ఎంబసీ అధికారులు.. ఇరాన్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. భారతీయుల జాడ గుర్తించాలని కోరారు. ఇక ఎప్పటికప్పుడు సమాచారాన్ని కుటుంబ సభ్యులతో ఎంబసీ పంచుకుంటోంది. ఇన్ని రోజులైనా తమ పిల్లల జాడ ఇంకా తెలియకపోవడంతో భయాందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Rythu Bharosa : రైతు భరోసాపై కీలక ప్రకటన.. అకౌంట్లో డబ్బులు అప్పుడే.!
పంజాబ్లోని హోషియార్పూర్ ఏజెంట్ దుబాయ్-ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని ముగ్గురికి హామీ ఇచ్చి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరికి ఇరాన్లో బస కల్పిస్తున్నట్లు ఏజెంట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ మే 1న ఇరాన్లో అడుగుపెట్టగానే ముగ్గురు కిడ్నాప్నకు గురయ్యారు. ఇక అప్పటినుంచి ఏజెంట్ జాడ కూడా పత్తాలేకుండాపోయింది. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఏజెంట్ ఆచూకీ తెలిస్తే.. తమ బిడ్డలు ఎక్కడున్నారన్నది తెలుస్తుందని చెబుతున్నారు. కిడ్నాపర్లు రూ.కోటి ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురి జాడ కోసం ఇరాన్ అధికారులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!