Mali-India: మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్
- మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్
- చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్నకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు భారతీయ పౌరులు అపహరణకు గురికావడంపై భారతీయ ఎంబసీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్నకు గురైన భారతీయులను సురక్షితంగా రక్షించి విడుదల చేయాలని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని భారత్ కోరింది.
ఇది కూడా చదవండి: PM Narendra Modi: ప్రధాని మోడీకి అరుదైన గౌరవం.. ఘనా జాతీయ అత్యున్నత అవార్డు ప్రదానం
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుస ఉగ్ర దాడులు జరుగుతున్నాయి. అయితే కేస్లోని డైమాండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయులు అపహరణకు గురయ్యారు. జూలై 1న సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ఆవరణలో ఉండగా బలవంతంగా దాడి చేసి ముగ్గురిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అయితే ఈ కిడ్నాప్లకు బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. మంగళవారం మాలి అంతటా జరిగిన సమన్వయ దాడులకు అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM) బాధ్యత వహించింది. ఈ గ్రూపే ముగ్గుర్ని అపహరించి ఉంటుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: వైఎస్ జగన్ వరుస పర్యటనలకు కారణం అదేనా..!?
ఇక బమాకోలోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమై.. సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపింది. అలాగే డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వహణ బృందంతో కూడా చర్చలు జరిపింది. మాలి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఎంబసీ సంప్రదింపులు జరుపుతోంది. అలాగే అపహరణకు గురైన భారతీయ పౌరుల కుటుంబ సభ్యులతో కూడా ఎంబసీ సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ తెలిపింది. ఈ కిడ్నాప్ను భారత ప్రభుత్వం ఖండిస్తోందని.. త్వరగా విడుదలకు అన్ని చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని కోరినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం మాలిలో నివసిస్తున్న భారతీయులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. భారతీయులకు సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని తెలిపింది.
తాజావార్తలు
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్కు బీసీసీఐ అల్టిమేటం!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!