Thai Warship Sinks: నీట మునిగిన భారీ యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thai warship sinks in severe weather leaving 31 crew missing: సోమవారం గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్లో ఒక థాయ్ యుద్ధ నౌక (హెచ్టీఎంస్ సుఖొథాయ్) ప్రమాదవశాత్తూ నీట మునిగింది. బలమైన ఈదురుగాలుల కారణంగా.. సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరింది. మొబైల్ పంపింగ్ మిషన్ల ద్వారా లోపలికి వచ్చిన నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ.. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడం, ఇంజిన్ కూడా పని చేయకపోవడంతో ఆ నౌకలోకి మరింత నీరు వచ్చి చేరింది. దీంతో.. ఆ నౌక ఒకవైపుకి ఒరుగుతూ, సముద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఆ నౌకలో మొత్తం 106 మంది నేవీ సిబ్బంది ఉండగా.. 31 మంది గల్లంతయ్యారు. మరో 75 మందిని సహాయక సిబ్బంది కాపాడగలిగింది.
Lionel Messi: యూ-టర్న్ తీసుకున్న మెస్సీ.. ఫ్యాన్స్కి పండగే!
Also Read
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
- Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
థాయ్లాండ్లోని ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్లో సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ యుద్ధ నౌక ఆదివారం సాయంత్రం విధుల్లో పాల్గొంది. అయితే.. ఇంతలోనే అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో, ఈ నౌక ప్రమాదానికి గురైంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే.. థాయ్ నౌకాదళం సంఘటనా స్థలానికి వెంటనే మూడు ఫ్రిగెట్లు, రెండు హెలికాప్టర్లను పంపించింది. ఎలాగైనా నీట మునగకుండా ఆ నౌకను కాపాడేందుకు వాళ్లు సహాయక సిబ్బంది వారు తీవ్రంగా శ్రమించారు. కానీ, బలమైన గాలుల కారణంగా అది సాధ్యపడలేదు. గల్లంతైన 31 మంది కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో నావికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్తున్నారు.
Fifa World Cup: వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి.. ఫ్రాన్స్లో చెలరేగిన అల్లర్లు
ఈ 960 టన్నుల సుఖోథాయ్ని యునైటెడ్ స్టేట్స్లో నిర్మించి, 1987లో థాయ్ నేవీలో విధుల్లోకి తీసుకొచ్చారు. ఇది పాత నౌక కావడంతో.. ప్రమాద సమయంలో అందులోని నేవీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని ఓ రిటైర్డ్ యూఎస్ నేవీ కెప్టెన్ పేర్కొన్నారు. ఒక్కసారి విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే.. లోపల చీకటి కమ్ముకుంటుందని, అప్పుడు ఏం చేయడానికి వీలుండదని తెలిపారు. కాగా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ థాయ్ నౌక మునిగిపోవడం, ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?