Hindu Temple Attack: ఖలిస్తాని వేర్పాటువాదుల దాష్టీకం.. మరో హిందూ దేవాలయంపై దాడి..
Hindu Temple Attack: ఖలిస్తానీ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. ఓ పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఇండియాలో అశాంతిని చెలరేగేలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, యూకే దేశాల్లో పలు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలే టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. హిందూ దేవాలయాలపై ఖలిస్తానీ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలను రాస్తున్నారు.
Read Also: Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. చనిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
తాజాగా మరోసారి ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయంపై దాడి చేశారు. తాజాగా బ్రిస్బేన్ లోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాని అనుకూల మద్దతుదారులు శనివారం దాడి చేశారు. ఆలయగోడలపై జరిగిన విధ్వంసం గురించి ఆలయ పూజారి భక్తులకు సమాచారం ఇచ్చారని ఆలయ అధ్యక్షుడు సతీందర్ శుక్లా ది ఆస్ట్రేలియన్ టుడే వెబ్బైట్ కు తెలియజేశారు. ఈ ఘటనపై క్వీన్స్ లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హిందువులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నమే అని హిందూ హ్యుమన్ రైట్స్ డైరెక్టర్ సారా గేట్స్ అన్నారు.
ఆలయంపై హిందూ వ్యతిరేక విద్వేష గ్రాఫిటీని శుభ్రం చేశారు. హిందూస్థాన్ జిందాబాద్ అంటూ సారాగేట్స్ ఫోటోలను ట్వీట్ చేశారు. గత రెండు నెలల కాలంలో హిందూ ఆలయాలపై జరిగిన నాలుగో ఘటన ఇది. జనవరి 23న, మెల్బోర్న్లోని ఆల్బర్ట్ పార్క్లోని గౌరవప్రదమైన ఇస్కాన్ దేవాలయం గోడలు “హిందూస్థాన్ ముర్దాబాద్” అనే గ్రాఫిటీతో రాతలు రాశారు. అంతకుముందు జనవరి 16న, విక్టోరియాలోని క్యారమ్ డౌన్స్లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు దేవాలయం కూడా ఇదే విధంగా దాడికి గురైంది. నవరి 12న, మెల్బోర్న్లోని స్వామినారాయణ ఆలయంపై దాడి చేశారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ ఘటనలపై ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!