Tayfun Block-4: “హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్”ను తయారు చేసిన టర్కీ.. భారత్కు ఇబ్బంది..
- హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ తయారు చేసిన టర్కీ..
- టేఫన్ బ్లాక్-4 క్షిపణిని ప్రదర్శించిన అంకారా..
- పాక్తో టర్కీ మిత్రుత్వం, భారత్కు ఇబ్బందికరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tayfun Block-4: పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్కు హైపర్సోనిక్ వెర్షన్.
టేఫన్ బ్లాక్ 4 పొడవు 6.5 మీటర్లు, బరువు 7000 కిలోగ్రాములు, 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేసే సత్తా దీనికి ఉంది. మల్టీ పర్పస్ వార్ హెడ్లను మోసుకెళ్లే సత్తా కలిగిన ఈ క్షిపణి, మాక్-5 వేగం ( అంటే గంటకు 6100 కి.మీ) వేగంతో వెళ్తుంది. దీంతో ఏ క్షిపణి నిరోధక వ్యవస్థ కూడా దీనిని గుర్తించి, నాశనం చేయడం కష్టమవుతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కమాండ్ అండ్ కంట్రోల్, సైనిక హ్యాంగర్లు, కీలకమైన సైనిక సౌకర్యాల వంటి కీలకమైన లక్ష్యాలను కిలోమీటర్ల దూరం నుంచే నాశనం చేయగలదు.
Also Read
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
Read ALSO: China: బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఎజెండాకు చైనా మద్దతు..? బంగ్లాలోని హిందువులకు భారీ ముప్పు..!
అయితే, టర్కీ తన తొలి హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ని తయారు చేయడం భారత్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం టర్కీలోని తయ్యప్ ఎర్డోగాన్ ప్రభుత్వం భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రెండు నెలల క్రితం జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో పాకిస్తాన్కి టర్కీ మద్దతు ఇవ్వడమే కాకుండా, టర్కిష్ డ్రోన్లను అందించింది. వీటిని ఆపరేట్ చేయడానికి కొందరు టర్కీ నిపుణులను కూడా పాకిస్తాన్కు పంపింది.
ఈ నేపథ్యంలో, టర్కీ-పాకిస్తాన్ మధ్య సంబంధాలు కారణంగా భవిష్యత్తులో ఈ మిస్సైల్ని పాకిస్తాన్ కొనే అవకాశం ఉంది. ఇప్పటికే, టర్కీ తన బైరెక్టర్ డ్రోన్లను పాకిస్తాన్కు అప్పగించింది. సిందూర్ సమయంలో టర్కీ డ్రోన్లను ఉపయోగించే పాకిస్తాన్, భారత భూభాగాలపై దాడులు చేయాలని ప్రయత్నించింది. అయితే, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటన్నింటిని కుప్పకూల్చింది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!