Tayfun Block-4: “హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్”ను తయారు చేసిన టర్కీ.. భారత్కు ఇబ్బంది..
- హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ తయారు చేసిన టర్కీ..
- టేఫన్ బ్లాక్-4 క్షిపణిని ప్రదర్శించిన అంకారా..
- పాక్తో టర్కీ మిత్రుత్వం, భారత్కు ఇబ్బందికరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tayfun Block-4: పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్కు హైపర్సోనిక్ వెర్షన్.
టేఫన్ బ్లాక్ 4 పొడవు 6.5 మీటర్లు, బరువు 7000 కిలోగ్రాములు, 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేసే సత్తా దీనికి ఉంది. మల్టీ పర్పస్ వార్ హెడ్లను మోసుకెళ్లే సత్తా కలిగిన ఈ క్షిపణి, మాక్-5 వేగం ( అంటే గంటకు 6100 కి.మీ) వేగంతో వెళ్తుంది. దీంతో ఏ క్షిపణి నిరోధక వ్యవస్థ కూడా దీనిని గుర్తించి, నాశనం చేయడం కష్టమవుతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కమాండ్ అండ్ కంట్రోల్, సైనిక హ్యాంగర్లు, కీలకమైన సైనిక సౌకర్యాల వంటి కీలకమైన లక్ష్యాలను కిలోమీటర్ల దూరం నుంచే నాశనం చేయగలదు.
Also Read
- PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
- PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Free Afghan Women: ఒక బుర్ఖా.. 1000 ప్రశ్నలు.. ప్రపంచాన్ని కదిలిస్తున్న ట్రెండ్ వెనుక అసలు కథ ఇదే!
Read ALSO: China: బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఎజెండాకు చైనా మద్దతు..? బంగ్లాలోని హిందువులకు భారీ ముప్పు..!
అయితే, టర్కీ తన తొలి హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ని తయారు చేయడం భారత్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం టర్కీలోని తయ్యప్ ఎర్డోగాన్ ప్రభుత్వం భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రెండు నెలల క్రితం జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో పాకిస్తాన్కి టర్కీ మద్దతు ఇవ్వడమే కాకుండా, టర్కిష్ డ్రోన్లను అందించింది. వీటిని ఆపరేట్ చేయడానికి కొందరు టర్కీ నిపుణులను కూడా పాకిస్తాన్కు పంపింది.
ఈ నేపథ్యంలో, టర్కీ-పాకిస్తాన్ మధ్య సంబంధాలు కారణంగా భవిష్యత్తులో ఈ మిస్సైల్ని పాకిస్తాన్ కొనే అవకాశం ఉంది. ఇప్పటికే, టర్కీ తన బైరెక్టర్ డ్రోన్లను పాకిస్తాన్కు అప్పగించింది. సిందూర్ సమయంలో టర్కీ డ్రోన్లను ఉపయోగించే పాకిస్తాన్, భారత భూభాగాలపై దాడులు చేయాలని ప్రయత్నించింది. అయితే, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటన్నింటిని కుప్పకూల్చింది.
తాజావార్తలు
-
PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!