Tayfun Block-4: “హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్”ను తయారు చేసిన టర్కీ.. భారత్కు ఇబ్బంది..
- హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ తయారు చేసిన టర్కీ..
- టేఫన్ బ్లాక్-4 క్షిపణిని ప్రదర్శించిన అంకారా..
- పాక్తో టర్కీ మిత్రుత్వం, భారత్కు ఇబ్బందికరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tayfun Block-4: పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్కు హైపర్సోనిక్ వెర్షన్.
టేఫన్ బ్లాక్ 4 పొడవు 6.5 మీటర్లు, బరువు 7000 కిలోగ్రాములు, 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేసే సత్తా దీనికి ఉంది. మల్టీ పర్పస్ వార్ హెడ్లను మోసుకెళ్లే సత్తా కలిగిన ఈ క్షిపణి, మాక్-5 వేగం ( అంటే గంటకు 6100 కి.మీ) వేగంతో వెళ్తుంది. దీంతో ఏ క్షిపణి నిరోధక వ్యవస్థ కూడా దీనిని గుర్తించి, నాశనం చేయడం కష్టమవుతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కమాండ్ అండ్ కంట్రోల్, సైనిక హ్యాంగర్లు, కీలకమైన సైనిక సౌకర్యాల వంటి కీలకమైన లక్ష్యాలను కిలోమీటర్ల దూరం నుంచే నాశనం చేయగలదు.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
Read ALSO: China: బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఎజెండాకు చైనా మద్దతు..? బంగ్లాలోని హిందువులకు భారీ ముప్పు..!
అయితే, టర్కీ తన తొలి హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ని తయారు చేయడం భారత్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం టర్కీలోని తయ్యప్ ఎర్డోగాన్ ప్రభుత్వం భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రెండు నెలల క్రితం జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో పాకిస్తాన్కి టర్కీ మద్దతు ఇవ్వడమే కాకుండా, టర్కిష్ డ్రోన్లను అందించింది. వీటిని ఆపరేట్ చేయడానికి కొందరు టర్కీ నిపుణులను కూడా పాకిస్తాన్కు పంపింది.
ఈ నేపథ్యంలో, టర్కీ-పాకిస్తాన్ మధ్య సంబంధాలు కారణంగా భవిష్యత్తులో ఈ మిస్సైల్ని పాకిస్తాన్ కొనే అవకాశం ఉంది. ఇప్పటికే, టర్కీ తన బైరెక్టర్ డ్రోన్లను పాకిస్తాన్కు అప్పగించింది. సిందూర్ సమయంలో టర్కీ డ్రోన్లను ఉపయోగించే పాకిస్తాన్, భారత భూభాగాలపై దాడులు చేయాలని ప్రయత్నించింది. అయితే, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటన్నింటిని కుప్పకూల్చింది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!