Taliban: పాకిస్తాన్కు వచ్చే కొన్నేళ్లలో తాగడానికి, వ్యవసాయానికి నీరు కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘సింధూ జల ఒప్పందం’’ను నిలిపేసింది. పాకిస్తాన్కు ముఖ్యంగా, పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో సింధూ, దాని ఉప నదులే ప్రజల జీవితాలకు ఆధారం. ఇప్పుడు, భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నడుస్తున్నారు. ఆఫ్ఘాన్ నుంచి పాక్లోకి వెళ్లే నదుల నీటిని సరిహద్దు దాటనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.