తాలిబన్ల మరో సంచలన నిర్ణయం: అధికారులకు క్షమాభిక్ష…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నటి వరకు ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అరాచకపాలన మొదలౌతుందని, అనేక ప్రాంతాల్లో అప్పటికే ఆ తరహా పాలన మొదలైందని ప్రజలు భయపడ్డారు. నెల రోజుల క్రితం నుంచి తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కార్యాలయాలు, పాఠశాలలు తెరుచుకోకపోడంతో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదేవిధమైన పాలన కొనసాగుతుందని అనుకున్నారు. అయితే, అధికారం మార్పిడి జరుగుతున్న సమయంలోనే తాలిబన్ నేతలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని, ఆయుధాలు తీసుకొవద్దని, ప్రజల ఆస్తులు కాపాడాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా మరికొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు క్షమాభిక్ష ప్రకటించారు. అధికారులంతా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రకటనతో తిరిగి ఆ దేశంలో శాంతి నెలకొనే అవకాశ ఉంటుంది. తమకు శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలు కావాలని ఇప్పటికే తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి పాలన కూడా శాంతియుతంగా, ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి దిశగా కొనసాగితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది.
Read: తాలిబన్ నేత కీలక ఆదేశాలు…కాబూల్లో సాధారణ పరిస్థితులు…
Also Read
తాజావార్తలు
-
Iran: ఖమేనీ శవపేటికకు ఫైటర్ జెట్లలో పహారా..
-
Ponnam Prabhakar : వర్షాకాలం.. బస్తీ దవాఖానలపై ప్రభుత్వం అలర్ట్
-
El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
-
TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
-
Viral Video : “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా”.. మనవడితో సీఎం రేవంత్ రెడ్డి మధుర క్షణాలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!