Schengen Visa: సూపర్ ఫాస్ట్ గా జర్మనీ షెంజెన్ వీసా ప్రక్రియ.. సిబ్బందిని పెంచిన రాయబార కార్యాలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schengen Visa: జర్మనీకి చెందిన షెంజెన్ వీసా ప్రక్రియను చాలా వేగంగా నిర్వహిస్తున్నారు. వీసా జారీ ప్రక్రియ సమయాన్ని తగ్గించినట్టు ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇండియా నుంచి యూరప్ ప్రయాణాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జర్మనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారతీయ పర్యాటకుల కోసం జర్మనీ జారీ చేస్తున్న షెంజెన్ వీసా ప్రక్రియ సమయాన్ని ఎనిమిది వారాలకు తగ్గించినట్లు జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎన్జ్వైలర్ తెలిపారు. గడువును మరింత కుదించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వీసా ఒక ముఖ్యమైన అంశమని.. దరఖాస్తులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకు వివిధ మార్గాల ద్వారా కృషి చేస్తున్నామని.. ముంబయిలో వీసా జారీకి సిబ్బంది సంఖ్యను పెంచినట్టు తెలిపారు. సిబ్బంది పెంపుతో వీసా కోసం వేచి చూసే సమయం గణనీయంగా తగ్గనుందని జార్జ్ చెప్పారు.
Read also: Andhrapradesh: విద్యుత్ ఉద్యోగులతో ఫలించిన చర్చలు.. 8 శాతం ఫిట్మెంట్కు అంగీకారం
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
షెంజెన్ వీసాను విదేశాల్లో భారతీయ పర్యాటకులు స్వల్పకాలం బస చేయడానికి ఇస్తారు. ఈ వీసాతో గరిష్ఠంగా 90 రోజుల వరకు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీసా లభించినట్లయితే ఐరోపాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన 27 దేశాల్లో ఏ దేశానికైనా వెళ్లొచ్చు. పర్యాటకం, వ్యాపారం నిమిత్తం వెళ్లేవారికి ఈ తరహా వీసాలను ఎక్కువగా జారీ చేస్తారు. ఈ వీసాల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో ఇటీవలి కాలంలో భారత్ నుంచి యూరప్కు వెళ్లే ప్రయాణీకుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో షెంజెన్ వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జర్మన్ రాయబార కార్యాలయం నిర్ణయించింది. జర్మన్ నేషనల్ టూరిస్టు బోర్డు గణాంకాల ప్రకారం.. 2022లో భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 209 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది. అయితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య ఇంకా 65 శాతం వద్దే ఉన్నట్టు వారు గుర్తించారు. షెంజెన్ వీసాలకు అధిక డిమాండ్ ఏర్పడటంతో అపాయింట్మెంట్, ప్రాసెసింగ్ కోసం ఎక్కువ సమయం పడుతున్నట్లు గత ఏప్రిల్లో జర్మన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో జర్మనీ వెళ్లాలనుకునేవారు తమ ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడర్(వీఎఫ్ఎస్)తో ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని అందులో పేర్కొంది. ఇది పూర్తయి కాన్సులేట్ వద్దకు దరఖాస్తు వచ్చిన తరువాతనే వీసా జారీ ప్రక్రియ మొదలవుతుందని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. వీసా డెలివరీ సమయం, సెలవులను పరిగణనలోకి తీసుకొంటే వీసా జారీ ప్రక్రియ కొన్నిసార్లు ఆరు రోజులు కూడా పట్టొచ్చని రాయబార కార్యాలయం ప్రకటించింది. పర్యాటకుల సంఖ్యను పెంచుకోవడం కోసం జర్మన్ షెంజెన్ వీసా ప్రక్రియను వేగవంతం చేసింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..