Schengen Visa: సూపర్ ఫాస్ట్ గా జర్మనీ షెంజెన్ వీసా ప్రక్రియ.. సిబ్బందిని పెంచిన రాయబార కార్యాలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schengen Visa: జర్మనీకి చెందిన షెంజెన్ వీసా ప్రక్రియను చాలా వేగంగా నిర్వహిస్తున్నారు. వీసా జారీ ప్రక్రియ సమయాన్ని తగ్గించినట్టు ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇండియా నుంచి యూరప్ ప్రయాణాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జర్మనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారతీయ పర్యాటకుల కోసం జర్మనీ జారీ చేస్తున్న షెంజెన్ వీసా ప్రక్రియ సమయాన్ని ఎనిమిది వారాలకు తగ్గించినట్లు జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎన్జ్వైలర్ తెలిపారు. గడువును మరింత కుదించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వీసా ఒక ముఖ్యమైన అంశమని.. దరఖాస్తులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకు వివిధ మార్గాల ద్వారా కృషి చేస్తున్నామని.. ముంబయిలో వీసా జారీకి సిబ్బంది సంఖ్యను పెంచినట్టు తెలిపారు. సిబ్బంది పెంపుతో వీసా కోసం వేచి చూసే సమయం గణనీయంగా తగ్గనుందని జార్జ్ చెప్పారు.
Read also: Andhrapradesh: విద్యుత్ ఉద్యోగులతో ఫలించిన చర్చలు.. 8 శాతం ఫిట్మెంట్కు అంగీకారం
Also Read
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
షెంజెన్ వీసాను విదేశాల్లో భారతీయ పర్యాటకులు స్వల్పకాలం బస చేయడానికి ఇస్తారు. ఈ వీసాతో గరిష్ఠంగా 90 రోజుల వరకు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీసా లభించినట్లయితే ఐరోపాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన 27 దేశాల్లో ఏ దేశానికైనా వెళ్లొచ్చు. పర్యాటకం, వ్యాపారం నిమిత్తం వెళ్లేవారికి ఈ తరహా వీసాలను ఎక్కువగా జారీ చేస్తారు. ఈ వీసాల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో ఇటీవలి కాలంలో భారత్ నుంచి యూరప్కు వెళ్లే ప్రయాణీకుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో షెంజెన్ వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జర్మన్ రాయబార కార్యాలయం నిర్ణయించింది. జర్మన్ నేషనల్ టూరిస్టు బోర్డు గణాంకాల ప్రకారం.. 2022లో భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 209 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది. అయితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య ఇంకా 65 శాతం వద్దే ఉన్నట్టు వారు గుర్తించారు. షెంజెన్ వీసాలకు అధిక డిమాండ్ ఏర్పడటంతో అపాయింట్మెంట్, ప్రాసెసింగ్ కోసం ఎక్కువ సమయం పడుతున్నట్లు గత ఏప్రిల్లో జర్మన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో జర్మనీ వెళ్లాలనుకునేవారు తమ ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడర్(వీఎఫ్ఎస్)తో ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని అందులో పేర్కొంది. ఇది పూర్తయి కాన్సులేట్ వద్దకు దరఖాస్తు వచ్చిన తరువాతనే వీసా జారీ ప్రక్రియ మొదలవుతుందని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. వీసా డెలివరీ సమయం, సెలవులను పరిగణనలోకి తీసుకొంటే వీసా జారీ ప్రక్రియ కొన్నిసార్లు ఆరు రోజులు కూడా పట్టొచ్చని రాయబార కార్యాలయం ప్రకటించింది. పర్యాటకుల సంఖ్యను పెంచుకోవడం కోసం జర్మన్ షెంజెన్ వీసా ప్రక్రియను వేగవంతం చేసింది.
తాజావార్తలు
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..