Schengen Visa: సూపర్ ఫాస్ట్ గా జర్మనీ షెంజెన్ వీసా ప్రక్రియ.. సిబ్బందిని పెంచిన రాయబార కార్యాలయం
Schengen Visa: జర్మనీకి చెందిన షెంజెన్ వీసా ప్రక్రియను చాలా వేగంగా నిర్వహిస్తున్నారు. వీసా జారీ ప్రక్రియ సమయాన్ని తగ్గించినట్టు ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇండియా నుంచి యూరప్ ప్రయాణాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జర్మనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారతీయ పర్యాటకుల కోసం జర్మనీ జారీ చేస్తున్న షెంజెన్ వీసా ప్రక్రియ సమయాన్ని ఎనిమిది వారాలకు తగ్గించినట్లు జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎన్జ్వైలర్ తెలిపారు. గడువును మరింత కుదించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వీసా ఒక ముఖ్యమైన అంశమని.. దరఖాస్తులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకు వివిధ మార్గాల ద్వారా కృషి చేస్తున్నామని.. ముంబయిలో వీసా జారీకి సిబ్బంది సంఖ్యను పెంచినట్టు తెలిపారు. సిబ్బంది పెంపుతో వీసా కోసం వేచి చూసే సమయం గణనీయంగా తగ్గనుందని జార్జ్ చెప్పారు.
Read also: Andhrapradesh: విద్యుత్ ఉద్యోగులతో ఫలించిన చర్చలు.. 8 శాతం ఫిట్మెంట్కు అంగీకారం
Also Read
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
షెంజెన్ వీసాను విదేశాల్లో భారతీయ పర్యాటకులు స్వల్పకాలం బస చేయడానికి ఇస్తారు. ఈ వీసాతో గరిష్ఠంగా 90 రోజుల వరకు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీసా లభించినట్లయితే ఐరోపాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన 27 దేశాల్లో ఏ దేశానికైనా వెళ్లొచ్చు. పర్యాటకం, వ్యాపారం నిమిత్తం వెళ్లేవారికి ఈ తరహా వీసాలను ఎక్కువగా జారీ చేస్తారు. ఈ వీసాల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో ఇటీవలి కాలంలో భారత్ నుంచి యూరప్కు వెళ్లే ప్రయాణీకుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో షెంజెన్ వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జర్మన్ రాయబార కార్యాలయం నిర్ణయించింది. జర్మన్ నేషనల్ టూరిస్టు బోర్డు గణాంకాల ప్రకారం.. 2022లో భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 209 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది. అయితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య ఇంకా 65 శాతం వద్దే ఉన్నట్టు వారు గుర్తించారు. షెంజెన్ వీసాలకు అధిక డిమాండ్ ఏర్పడటంతో అపాయింట్మెంట్, ప్రాసెసింగ్ కోసం ఎక్కువ సమయం పడుతున్నట్లు గత ఏప్రిల్లో జర్మన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో జర్మనీ వెళ్లాలనుకునేవారు తమ ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడర్(వీఎఫ్ఎస్)తో ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని అందులో పేర్కొంది. ఇది పూర్తయి కాన్సులేట్ వద్దకు దరఖాస్తు వచ్చిన తరువాతనే వీసా జారీ ప్రక్రియ మొదలవుతుందని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. వీసా డెలివరీ సమయం, సెలవులను పరిగణనలోకి తీసుకొంటే వీసా జారీ ప్రక్రియ కొన్నిసార్లు ఆరు రోజులు కూడా పట్టొచ్చని రాయబార కార్యాలయం ప్రకటించింది. పర్యాటకుల సంఖ్యను పెంచుకోవడం కోసం జర్మన్ షెంజెన్ వీసా ప్రక్రియను వేగవంతం చేసింది.
తాజావార్తలు
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంటె సంగతులు అని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!