Sudan: సూడాన్లో తీవ్రమైన హింస.. 200 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudan Crisis: సైన్యం, పారామిలిటరీల మధ్య రాజుకున్న వివాదం సూడాన్ లో తీవ్ర హింసకు దారి తీసింది. ఈ రెండు బలగాల మధ్య తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. పారామిలిటరీని సైన్యంలో కలిపే ప్రతిపాదనతో సైన్యాధ్యక్షుడు, పారామిలిటీరీ కమాండర్ మధ్య వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణల్లో 200 మంది మరణించగా.. 1800 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. మూడు రోజులుగా కొనసాతున్న ఈ ఘర్షణల్లో రాజధాని ఖార్టుమ్ లోని పలు ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. వైద్యం, ఆహారం కొరత ఏర్పడింది.
2021లో తిరుగబాటుతో అధికారాన్ని చేపట్టిన ఇద్దరు జనరల్స్ సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫట్టా అల్-బుర్హాన్, శక్తివంతమైన పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్కు నాయకత్వం వహిస్తున్న అతని డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాలపాటు సాగిన అధికార పోరాటం శనివారం ఘోరమైన హింసాత్మకంగా మారింది. రాజధానిలో పరిస్థితులు తీవ్రంగా తయారు అయ్యాయి. ఇరు వర్గాలు కూడా వారి వ్యతిరేక స్థావరాలపై దాడులు చేసుకుంటున్నాయి.
Also Read
Read Also: Pakistan: పాకిస్తాన్లో చైనా వ్యాపారాలు క్లోజ్.. భద్రతే ప్రధాన కారణం..
ప్రజలు ఆహారం, పెట్రోల్ కోసం దాడుల మధ్యే క్యూల్లో నిలబడాల్సి పరిస్థితి ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఇరు పక్షాలు శతృత్వాన్ని వీడాలంటూ పిలుపునిచ్చారు. రాజధాని ఖార్టూమ్ నగరంలో తొమ్మిది ఆస్పత్రుల్లో రక్తమార్పిడి, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఇతర మందులు అయిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.
ఇదిలా ఉంటే ఈ ఘర్షణల మధ్య యూరోపియన్ యూనియన్ రాయబారి ఇంటిపై దాడి జరిగింది. మరోవైపు భారతీయుల భద్రతపై అక్కడి రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని కోరింది. సూడాన్ ఘర్షణల్లో కేరళకు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. అతడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి అధికారం యంత్రాంగం పనిచేస్తోంది.
- Tags
- Africa
- EU
- india
- Sudan
- Sudan Crisis
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!