Ranil Wickremesinghe:ఉన్న ఒక్క ఇంటినీ కాల్చేశారు.. శ్రీలంక ప్రధాని తీవ్ర ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనకు ఉన్న ఒక్క ఇంటిని కూడా కాల్చివేశారని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశ టెలివిజన్లో మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా జరిగిన నష్టంపై ఆయన స్పందించారు. హిట్లర్ తరహా మనస్తత్వం ఉన్న వ్యక్తులే ఇలాంటి చర్యలతు దిగుతారని ఆయన మండిపడ్డారు. దేశం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా అధ్యక్షుడి కోరిక మేరకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టానని ఆయన చెప్పుకొచ్చారు.
కనీస నిత్యావసరాలు తీర్చుకోలేని స్థితిలో దేశం ఉండగా.. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే భారాన్నిమోసేందుకు సిద్ధమయ్యానన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు 4 సంవత్సరాలు పడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని వెల్లడించారు. ఇదంతా ఒకటి రెండు రోజుల్లో తీరే సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యలు చేపడుతున్న సమయంలో తన ఇంటికి నిప్పు పెట్టడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నియంత హిట్లర్ తరహా మనస్తత్వం ఉన్నవారే ఇలాంటి చర్యలు దిగుతారన్నారు. తాను ప్రధాని పదవికి రాజీనామా నిరాకరించానని, అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు అభ్యంతరం చెప్పానంటూ ఓ పార్టీ నేత చేసిన ట్వీట్ ఈ పరిస్థితికి దారితీసిందని చెప్పారు. ఒకవేళ అఖిలపక్షం ఏర్పడినా వెంటనే రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
PM Modi: ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిది..
శనివారం అన్ని సమావేశాలను రద్దు చేసుకొని, ఇంట్లోనే కూర్చున్నా. అప్పుడు పోలీసులు వచ్చి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఇక్కడ పరిస్థితులు అదుపుతప్పే అవకాశం ఉందని వెల్లడించారని రణిల్ విక్రమ సింఘే తెలిపారు. వెంటనే భార్యతో కలిసి సాయంత్రం అక్కడి నుంచి వెళ్లిపోయానన్నారు. సొంత దేశంలో, విదేశంలో కలిపి తనకు ఒకే ఒక్క ఇల్లు ఉందన్నారు. ఆ ఒక్క దానికి కూడా నిప్పుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన లైబ్రరీలో 2,500 పుస్తకాలున్నాయని.. అదే తనకున్న ఆస్తి అని వెల్లడించారు. 200 ఏళ్ల నాటి విలువైన కళాఖండాలున్నాయన్నారు. అన్నింటిని ధ్వంసం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో సేకరించిన పుస్తకాలన్నింటిని శ్రీలంకలోని కళాశాల, ఒక అంతర్జాతీయ సంస్థకు వితరణ చేయాలనుకున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!