Srilanka Crisis: శ్రీలంకలో ప్రధాని వర్సెస్ రాష్ట్రపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. అక్కడ రాష్ట్రపతి వర్సెస్ ప్రధాన మంత్రి తరహాలో రాజకీయం నడుస్తోంది. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితిని చక్కదిద్దేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక సర్కార్ ఏర్పాటుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారని.. శ్రీలంక ఫ్రీడం పార్టీ అధినేత, ఎంపీ మైత్రిపాల సిరసేన మీడియాకు తెలిపారు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంటుందని, కేబినెట్లో సుమారు 20 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధాని మహీంద రాజపక్స ఉండబోరని చెప్పారు.
ప్రధానికి 117 మంది ఎంపీల మద్దతు ఉంది. కానీ శుక్రవారం నాటికి శ్రీలంకలో రాజకీయ పరిణామాలు మారిపోయినట్టు తెలుస్తోంది. మైత్రిపాల సిరిసేన నేతృత్వంలోని అసమ్మతి వాదుల ప్రతినిధి బృందం.. కొలంబోలోని భారత హై కమిషనర్ గోపాల్ బాగ్లేతో భేటీ అయింది. దేశంలోని తాజా పరిస్థితిని వివరించింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ఇదిలా వుంటే అన్నయ్య వర్స్ తమ్ముడి పొలిటికల్ వార్ తారస్థాయికి చేరింది. అఖిలపక్ష సర్కార్ ఏర్పాటుకు లంక అధ్యక్షుడు గోటబోయో రాజపక్షే నిర్ణయించినా ఎట్టిపరిస్థితిలోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న ప్రధాని మహేంద్ర రాజపక్సే ప్రకటించడం కీలకం మారింది. ఈ నేపథ్యంలో 11 పార్టీలతో కోత్త ప్రభుత్వం, కొత్త ప్రధాన మంత్రి, కొత్త కేబినెట్ రావడంపై సందిగ్దత నెలకొంది. తన వర్గం ఎంపీల కీలకసమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు మహేంద్ర రాజపక్సే. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలీని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు అక్కడి ప్రజలు. ఇక.. దేశంలో సంక్షోభంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజపక్స కుటుంబం తమ పదవుల నుంచి తక్షణం వైదొలగాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?