Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనం నుంచి పురాతన కళాఖండాలు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మార్చి నుంచి అక్కడ తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోెభానికి అధ్యక్షుడు గొటబయ రాజపక్సతో పాటు, ప్రధాని మహిందా రాజపక్సలే కారణం అని జనాలు తిరగబడ్డారు. దీంతో ఇటీవల వీరిద్దరు రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను శ్రీలంక పార్లమెంట్ ఎన్నుకుంది. రెండు వారాల క్రితం అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ.. రాజధాని కొలంబోలోని టెంపుల్ ట్రీస్ లో ఉన్న అధ్యక్షభవనాన్ని, అధ్యక్షుడి కార్యాాలయాన్ని ఆందోళకారులు ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో గొటబయ రాజపక్స మాల్దీవులకు, అక్కడ నుంచి సింగపూర్ కు పరారయ్యాడు.
దాదాపుగా వారం పాటు ఆందోళకారులు అధ్యక్ష భవనంలోనే ఉంటూ.. అక్కడే మద్యం తాగడం, వంట చేసుకుని తినడం, స్మిమ్మింగ్ చేయడం వంటివి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి ఇంటిలో ఉన్న దాదాపు 1000కి పైగా పురాతన కళాఖండాలు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీటి విలువ కూడా ఎక్కువగానే ఉంటుందని శ్రీలంక పోలీసులు చెబుతున్నారు. అధ్యక్ష, పీఎం భవనాలను ఆక్రమించుకున్న ఆందోళకారులే వీటిని తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
Read Also: RajiniKanth: నా జీవితంలో డబ్బు ఉంది కానీ ప్రశాంతత లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తలైవా
ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిరసనకారులపై చర్యలు తీసుకుంటుంది. శుక్రవారం తెల్లవారుజామున గాలేఫేజ్ లో ఉన్న నిరసనకారులపై పోలీసులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను హక్కుల సంస్థలు ఖండిస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాయి. ప్రజలు శాంతియుత నిరసనల తెలిపేందుకు హక్కు ఉందని.. అలాగే అధ్యక్షుడి భవనం, ప్రధాన మంత్రి భవనం వంటి ప్రభుత్వ భవనాలను ఆక్రమించడాన్ని అనుతించబోనని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు. వీటిని నిరోధించేందుకు సైన్యం, పోలీసులకు అధికారాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!