Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనం నుంచి పురాతన కళాఖండాలు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మార్చి నుంచి అక్కడ తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోెభానికి అధ్యక్షుడు గొటబయ రాజపక్సతో పాటు, ప్రధాని మహిందా రాజపక్సలే కారణం అని జనాలు తిరగబడ్డారు. దీంతో ఇటీవల వీరిద్దరు రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను శ్రీలంక పార్లమెంట్ ఎన్నుకుంది. రెండు వారాల క్రితం అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ.. రాజధాని కొలంబోలోని టెంపుల్ ట్రీస్ లో ఉన్న అధ్యక్షభవనాన్ని, అధ్యక్షుడి కార్యాాలయాన్ని ఆందోళకారులు ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో గొటబయ రాజపక్స మాల్దీవులకు, అక్కడ నుంచి సింగపూర్ కు పరారయ్యాడు.
దాదాపుగా వారం పాటు ఆందోళకారులు అధ్యక్ష భవనంలోనే ఉంటూ.. అక్కడే మద్యం తాగడం, వంట చేసుకుని తినడం, స్మిమ్మింగ్ చేయడం వంటివి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి ఇంటిలో ఉన్న దాదాపు 1000కి పైగా పురాతన కళాఖండాలు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీటి విలువ కూడా ఎక్కువగానే ఉంటుందని శ్రీలంక పోలీసులు చెబుతున్నారు. అధ్యక్ష, పీఎం భవనాలను ఆక్రమించుకున్న ఆందోళకారులే వీటిని తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
Read Also: RajiniKanth: నా జీవితంలో డబ్బు ఉంది కానీ ప్రశాంతత లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తలైవా
ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిరసనకారులపై చర్యలు తీసుకుంటుంది. శుక్రవారం తెల్లవారుజామున గాలేఫేజ్ లో ఉన్న నిరసనకారులపై పోలీసులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను హక్కుల సంస్థలు ఖండిస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాయి. ప్రజలు శాంతియుత నిరసనల తెలిపేందుకు హక్కు ఉందని.. అలాగే అధ్యక్షుడి భవనం, ప్రధాన మంత్రి భవనం వంటి ప్రభుత్వ భవనాలను ఆక్రమించడాన్ని అనుతించబోనని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు. వీటిని నిరోధించేందుకు సైన్యం, పోలీసులకు అధికారాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!