SriLanka Protest: కనిపిస్తే కాల్చేయండి.. ఆదేశాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపైనా, హాని కలిగించే వారిపైనా కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఎలాంటి వారెంట్లు లేకుండా అరెస్ట్ చేసేందుకు అనుమతినిచ్చింది. ఎమర్జెన్సీ గుప్పిట్లో కొనసాగుతున్న శ్రీలంకలో సైన్యానికి, పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఆందోళనకారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడడం పట్ల శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో మండిపడుతున్న ప్రజలు… ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లను దగ్ధం చేశారు. ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స వైదొలిగాక హింస మరింత పెరిగింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురు మరణించగా, 220 మందికి పైగా గాయపడ్డారు.
కాగా, శ్రీలంకలో పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. దేశమంతా అల్లర్లతో అట్టుడుకుతోంది. పాలక వర్గాలకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాలకు ఆందోళనాకారులు నిప్పు పెడుతున్నారు. ప్రభుత్వ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య భీకరస్థాయిలో ఘర్షణ జరుగుతోంది. గొడవల్లో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరుతున్నవారు కూడా అధికంగా వున్నారు. ప్రధానమంత్రి పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కూడా శాంతిభద్రతలు అదుపులోకి రావడం లేదు. కర్ఫ్యూ విధించినా కంట్రోల్ కావడం లేదు. దీంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
అల్లర్లను అదుపులోకి తీసుకునేందుకు, మిలటరీ, పోలీసులకు ఎమర్జెన్సీ ప్రత్యేక అధికారాలు కట్టబెడుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పవర్స్ తో బలగాలు ఎలాంటి వారెంట్లు లేకుండానే నిరసనకారులను అదుపులోకి తీసుకోచ్చు. 24 గంటల పాటు అనుమానితులను తమ అదుపులో వుంచుకుని, తర్వాత పోలీసులకు అప్పగించే అధికారం ఆర్మీకి ఇచ్చారు. ఫోర్స్ కు స్పెషల్ పవర్ ఇవ్వడం వల్ల పౌర యుద్ధం మరింత పెరుగుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. మాజీ ప్రధాని మహింద రాజపక్సే, తన ఫ్యామిలీతో కలిసి రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నారు. ట్రిన్ కోమలిలోని నేవల్ బేస్ లోకి వెళ్లారు. కుమారుడు నమల్ కూడా కోలంబోను వీడాడు. మరోవైపు శ్రీలంక హింసను ఖండించిన ఐక్యరాజ్య సమితి, వీటిపై సమగ్ర, పారదర్శక విచారణ జరగాలంటోంది. లంకలో ప్రజాస్వామ్యం, సుస్థితర నెలకొనాలని భారత్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!