Bangladesh: బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది.. ఐదుగురు కీలక ఆర్మీ అధికారుల అరెస్ట్..
- బంగ్లాదేశ్లో కీలక పరిణామాలు..
- ఐదుగురు కీలక ఆర్మీ అధికారుల హౌజ్ అరెస్ట్..
- ఆర్మీ చీఫ్ రష్యా పర్యటనలో ఉండగా ఘటన..
- ఐదుగురు ఆర్మీ చీఫ్ మద్దతుదారులుగా నివేదికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ తన పట్టు నిలుపుకునేందుకు గేమ్స్ ఆడుతున్నాడు. ముఖ్యంగా, లౌకికవాదిగా, మాజీ ప్రధాని షేక్ హసీనాకు నమ్మకస్తుడిగా ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ని ఆ పదవి నుంచి దించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, అక్కడి మతోన్మాద సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ రష్యా పర్యటనలో ఉండగా, అతడి మద్దతుదారులైన ఆర్మీ అధికారులను హౌజ్ అరెస్ట్ చేశారు. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మద్దతుదారులను టచ్ చేశారంటే, నేరుగా ఆయననే సవాల్ చేసినట్లు.
ఈ పరిణామాలను బట్టి చూస్తే బంగ్లాదేశ్లో పెద్దగా ఏదో జరగబోతున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ సైన్యంలోని ఐదుగురు కీలకమైన సీనియర్ అధికారుల్ని ఢాకా కంటోన్మెంట్లో నిర్భందించారు. ఇందులో ఇద్దరు బ్రిగేడియర్లు, ఒక కల్నల్, ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్ ఉన్నారు. వీరిని వారి అధికారిక నివాసాలకే పరిమితం చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఐదుగురు అధికారుల గుర్తింపును బహిరంగంగా వెల్లడించలేదు.
Also Read
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
Read Also: Mamata Banerjee: “వక్ఫ్ చట్టాన్ని” బెంగాల్లో అమలు చేయం, అల్లర్లు దేనికి.?
భారత ఏజెన్సీలు ఐదుగురిని గుర్తించాయి. వారిలో బ్రిగేడియర్ జనరల్ ఎస్ ఎం జకారియా హుస్సేన్ (ఇంజనీర్స్ బ్రిగేడ్), బ్రిగేడియర్ జనరల్ ఇమ్రాన్ హమీద్ (ఇన్ఫాంట్రీ బ్రిగేడ్) ఉన్నారు. హమీద్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఏడీసీగా పనిచేశారు. రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) నుండి కల్నల్ అబ్దుల్లా అల్-మోమెన్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) నుండి లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ రిద్వానుల్ ఇస్లాం,తూర్పు బెంగాల్ రెజిమెంట్ నుండి మేజర్ మొహమ్మద్ నోమాన్ అల్ ఫరూక్లను నిర్భందించారు. వీరంతా ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్కి మద్దతుదారులు.
గత రెండు రోజలుగా వీరిపై నిఘాను ఉంచారు. వారి కార్యకలాపాలను పరిమితం చేయడంతో పాటు, విధుల నుంచి వీరిని తొలగించారు. అంతేకాకుండా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) అధికారులపై అభియోగాలు నమోదు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వస్తున్న సమాచారం ప్రకారం, ముందుగా ఆర్మీ చీఫ్ జమాన్ మొదట్లో వీరిని నిర్భంధించేందుకు అనుమతి ఇవ్వలేదని, ఐసీటీ వారిపై తీర్మానాలను సమర్పించిన తర్వాత హౌజ్ అరెస్ట్కి అధికారాలు ఇచ్చినట్లు నివేదికలు వెలువడ్డాయి. వీరంతా దేశం వదిలి వెళ్లకుండా కఠినమైన నిఘాలో ఉంచినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..