Mamata Banerjee: “వక్ఫ్ చట్టాన్ని” బెంగాల్లో అమలు చేయం, అల్లర్లు దేనికి.?
- వక్ఫ్ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయం..
- ఆందోళనకారులకు మమతా బెనర్జీ హామీ..
- ముర్షిదాబాద్ హింసతో అట్టుడికిన బెంగాల్..
- శాంతిగా ఉండాలని కోరిన మమతా బెనర్జీ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో పలు ప్రాంతాలో తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో ఆందోళనకారులు దుకాణాలు, వాహనాలే టార్గెట్గా నిప్పుపెడుతున్నారు. ముర్షిదాబాద్లో రైలుపై రాళ్లదాడి చేశారు. ఈ నేపథ్యంలో, బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళనకారులు శాంతించాలని విజ్ఞప్తి చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని తమ ప్రభుత్వం అమలు చేయదని ఆమె హామీ ఇచ్చారు.
‘‘ ఈ విషయంపై మేము మా వైఖరిని స్పష్టం చేశాము. మేము ఈ చట్టానికి మద్దతు ఇవ్వము. ఈ చట్టం మన రాష్ట్రంలో అమలు చేయబడదు. మరి అల్లర్లు దేని గురించి..?’’ అని ఆమె ఎక్స్లో ట్వీట్ చేసింది. “అన్ని మతాల ప్రజలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి, దయచేసి ప్రశాంతంగా ఉండండి, సంయమనంతో ఉండండి. మతం పేరుతో ఎటువంటి అన్యాయమైన ప్రవర్తనలో పాల్గొనవద్దు. ప్రతి మానవ జీవితం విలువైనది. రాజకీయాల కోసం అల్లర్లను ప్రేరేపించవద్దు. అల్లర్లను ప్రేరేపించేవారు సమాజానికి హాని కలిగిస్తున్నారు” అని ఆమె అన్నారు.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
Read Also: Vaishnavi Chaitanya: పాపం.. వైష్ణవి మీద పడితే ఏం లాభం?
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో 15 మంది అధికారులకు గాయాలయ్యాయి. బెంగాల్ టాప్ పోలీస్ అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ. శుక్రవారం జరిగిన హింసాత్మక నిరసనలకు పుకార్లు కారణమయ్యాయి, ఇందులో పోలీసు అవుట్పోస్టులు, రైల్వే కార్యాలయాలు మరియు దుకాణాలతో సహా అనేక ప్రభుత్వ వాహనాలు, భవనాలు ధ్వంసం చేయబడ్డాయని చెప్పారు.
చట్టాన్ని తమ పార్టీ సమర్థించలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసనకారులకు గుర్తు చేశారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని, కాబట్టి మీకు కావాల్సిన సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని అని ఆమె అన్నారు. నేరస్తులపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లాభం కోసం మతాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, వారికి లొంగిపోవద్దని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!