Bengal Governor: “నిందితుడిని ఉరితీసి, తర్వాత విచారించాలా.?” మమతా బెనర్జీపై గవర్నర్ ఫైర్..
- మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ ఫైర్..
- వైద్యురాలి ఘటనలో పోలీసులు వైఫల్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Governor: కోల్కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల పీజీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ, సీపీఎం పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఈ ఘటన వెనక తృణమూల్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారంటూ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.
ఇదిలా ఉంటే, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సీఎం మమతా బెనర్జీ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. ఆమె ‘‘డాక్టర్ జెకిల్ అండ్ హైడ్’’లాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారని ఆరోపించారు. ‘‘ముఖ్యమంత్రి నిందితుడిని ఉరితీసి, ఆపై విచారణని కొనసాగించండి అని చెప్పడం రోమన్ చక్రవర్తి మాట్లాడినట్లు ఉంది’’ అని అన్నారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Mamata Banerjee: కోల్కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే..
‘‘కేజీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఘటన తర్వాత నేను ఇప్పటికే ముఖ్యమంత్రికి సుదీర్ఘ లేఖ రాశాను, అందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించానని, రాజ్యాంగంలోని 167వ అధికరణం కింద ఆమె నుంచి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశాను. గత ఐదేళ్లలో నేను ఇలాంటి 30 లేఖలు పంపాను, వాటికి సమాధానాలు ఇవ్వలేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం.’’ అని అన్నారు. రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా చూసుకునేంత బలంగా ఉంది, నేను పరిస్థితిని చూస్తున్నాను మరియు బాగా ఆలోచించి భారత ప్రభుత్వానికి నివేదిక పంపుతానని అన్నారు.
వైద్యురాలి ఘటనపై మాట్లాడుతూ.. ఈ విషయం ఇప్పటికే హైకోర్టు పరిధిలో ఉందని, బాధితురాలికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కేసులో పోలీసులు ఖచ్చితంగా వైఫల్యం చెందారని నేను అనుకుంటున్నానని, పోలీసులు ఎవరో దొంగలు ఎవరో అని ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఈ కేసులో ఆర్జీ కర్ ఆస్పత్రి ‘‘కుంభకోణాల పాఠశాల’’గా మారిందని దుయ్యబట్టారు. మనం చూస్తున్నది కొంత అవినీతినే అని అన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!