Sheikh Hasina: బంగ్లాదేశ్లో షేక్ హసీనా పార్టీ కార్యాలయానికి నిప్పు..
- బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని వెంటాడుతున్న కష్టాలు..
- ఢాకాలోని షేక్ హసీనా పార్టీ ఆఫీసుపై దాడి చేసిన దుండగులు..
- అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి నిప్పు పెట్టిన అల్లరి మూకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ సర్కార్ లోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢాకాలోని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. ఆఫీసును ధ్వంసం చేసి, ఆపై నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్ను 15 సంవత్సరాలు పరిపాలించిన షేక్ హసీనా గత ఆగస్టులో విద్యార్థి ఉద్యమంతో తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆమె ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్నారు.
Read Also: Road Accident: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు!
Also Read
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
కాగా, బంగ్లాదేశ్కు 1971లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ విధానం కొనసాగుతుంది. స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు 30 శాతం, దేశంలోని వెనుకబడిన జిల్లాల యువతకు 10 శాతం, మహిళలకు 10 శాతం, మైనార్టీలకు 5 శాతం, వికలాంగులకు ఒకశాతం రిజర్వేషన్లు అందిస్తున్నారు. మొత్తంగా బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 2018లో బంగ్లాలోని యువత ఈ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కొన్ని నెలల పాటు కొనసాగిన నిరసన ఆ తర్వాత.. బంగ్లాదేశ్ సర్కార్ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Diwali Celebrations: టపాసులు పేలుస్తూ ఆవులను పరుగెత్తించారు.. ఇదో ఆచారమట మరి!
ఇక, 2024 జూన్ 5న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ దేశంలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. షేక్ హసీనా సర్కార్ కూడా సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయగా.. ఆ ఉత్తర్వును ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు బంగ్లాదేశ్లోని యూనివర్సిటీల నుంచి మొదలైన ఈ నిరసన ఆ తర్వాత హింసాత్మకంగా మారిపోయింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం యత్నించినప్పటికి అది ఫలించకపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన భారత్ పరార్ అయింది.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!