Pakistan: విధ్వంసానికి ఆర్ఎస్ఎస్, బీజేపీనే కారణమట.. పాకిస్తాన్ లో వింతవాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఆ దేశం రణరంగంగా మారింది. ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, పెషావర్, లాహోర్, క్వెట్టా ఇలా అన్ని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఆందోళనలు మిన్నంటాయి. రోడ్లను బ్లాక్ చేయడంతో పాటు పాకిస్తార్ రేడియో కేంద్రం, ఆర్మీ కొంటోన్మెంట్లను ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల కారణంగా ఆరుగురు మరణించారు. 1000పైగా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘అల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఆయనకు ఇస్లామాబాద్ కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది.
Read Also: Largest Stadiums: దేశంలోని టాప్-10 అతిపెద్ద క్రికెట్ మైదానాలు
Also Read
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
- China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక 'అసలు' మిస్టరీ ఇదేనా!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే పాకిస్తాన్ కొంతమంది వింతవాదనలు చేస్తున్నారు. భారతదేశం నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తులు పాకిస్తాన్ లో విధ్వంసాలకు పాల్పడుతున్నారంటూ వింత వాదన ఎత్తుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జరిపిన ఆందోళనలను ఉద్దేశిస్తూ.. పాక్ ప్రధాని షహజాబ్ షరీఫ్ ప్రత్యేక సహాయకుడు అట్టా తరార్ ఈ ఆరోపణలు చేశారు. విధ్వంసం, దహనాల వెనక ఉన్నది ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తులే అని తరార్ బుధవారం మీడియా ముందు వ్యాఖ్యానించారు.
కొంతమంది వ్యక్తులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధం కలిగి ఉన్నారని, నిన్నటి సంఘటనల తర్వాత భారతదేశంలో వేడుకలు జరిగాయని, ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబరాలు చేసుకున్నాయని, స్వీట్లు పంచుకున్నారని, నిన్న జరిగిన విధ్వంసం అంతా ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకే అని తరార్ అవివేకం అయిన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్సులను పాకిస్తాన్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. లా అండ్ ఆర్డర్ పరిస్థితిని ఆర్మీనే సమీక్షిస్తోంది.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!