Vladimir Putin: నరేంద్ర మోదీ “శాంతియుత చర్చల” వ్యాఖ్యలపై స్పందించిన పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin reacts to PM Modi’s ‘peaceful dialogue’ appeal in Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని విడనాడి శాంతియుత చర్చలకు వెళ్లాలని భారత ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. అయితే ఈ నరేంద్రమోదీ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ తో శాంతియుత చర్చలకు భారత్, చైనాలు మద్దతు ఇచ్చాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం అన్నారు. గత నెలలో ఉజ్బెకిస్తాన్ సమర్కండ్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో యుద్ధంపై మోదీ, జిన్ పింగ్ ఇద్దరూ పుతిన్ తో విభేదించారు.
తాజాగా కజక్ రాజధాని ఆస్తానాలో మాట్లాడుతూ.. భారత్, చైనా చర్చలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతిదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడాయి… ఈ రెండు దేశాలు మాకు సన్నిహిత మిత్రులు, భాగస్వాములు అని వారి స్థానాన్ని మేము గౌరవిస్తున్నామని పుతిన్ అన్నారు. అయితే ఉక్రెయిన్ చర్చలు కావాలని చెబుతూనే ఉంది.. వారు చర్చలు కావాలని కోరుకున్నట్లే కనిపిస్తుందని.. అయితే చర్చలను నిషేధిస్తూ అధికారిక నిర్ణయం తీసుకుందని పుతిన్ అన్నారు.
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
గత సెప్టెంబర్ నెలలో సమర్కండ్ వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో.. ప్రధాని మోదీ ‘‘ ఇది యుద్ధాల యుగం కాదు’’ అని పుతిన్ తో వ్యాఖ్యానించారు. ఈ సమస్యను త్వరలోనే ముగించాలని పుతిన్ ను కోరారు. చర్చలు, దౌత్యమార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతియుత చర్చలకు చైనా అన్ని ప్రయత్నాలు చేస్తుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి యూఎన్ఓలో చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో చర్చలు జరపాల్సిన అవసరం మాకు లేదని పుతిన్ అన్నారు. ఇండోనేషియా వేదికగా జరిగే జీ-20 సమ్మిట్ లో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై భారీ దాడులు అవసరం లేదని తెలిపారు పుతిన్. గత వారం పుతిన్ ఉక్రెయిన్ లోని 18 శాతం భూభాగాన్ని, తూర్పు ప్రాంతంలో ఉన్న ఖేర్సన్, జపొరిజ్జియా, లూహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో అధికారికంగా విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!