Vladimir Putin: నరేంద్ర మోదీ “శాంతియుత చర్చల” వ్యాఖ్యలపై స్పందించిన పుతిన్
Putin reacts to PM Modi’s ‘peaceful dialogue’ appeal in Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని విడనాడి శాంతియుత చర్చలకు వెళ్లాలని భారత ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. అయితే ఈ నరేంద్రమోదీ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ తో శాంతియుత చర్చలకు భారత్, చైనాలు మద్దతు ఇచ్చాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం అన్నారు. గత నెలలో ఉజ్బెకిస్తాన్ సమర్కండ్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో యుద్ధంపై మోదీ, జిన్ పింగ్ ఇద్దరూ పుతిన్ తో విభేదించారు.
తాజాగా కజక్ రాజధాని ఆస్తానాలో మాట్లాడుతూ.. భారత్, చైనా చర్చలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతిదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడాయి… ఈ రెండు దేశాలు మాకు సన్నిహిత మిత్రులు, భాగస్వాములు అని వారి స్థానాన్ని మేము గౌరవిస్తున్నామని పుతిన్ అన్నారు. అయితే ఉక్రెయిన్ చర్చలు కావాలని చెబుతూనే ఉంది.. వారు చర్చలు కావాలని కోరుకున్నట్లే కనిపిస్తుందని.. అయితే చర్చలను నిషేధిస్తూ అధికారిక నిర్ణయం తీసుకుందని పుతిన్ అన్నారు.
Also Read
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
గత సెప్టెంబర్ నెలలో సమర్కండ్ వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో.. ప్రధాని మోదీ ‘‘ ఇది యుద్ధాల యుగం కాదు’’ అని పుతిన్ తో వ్యాఖ్యానించారు. ఈ సమస్యను త్వరలోనే ముగించాలని పుతిన్ ను కోరారు. చర్చలు, దౌత్యమార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతియుత చర్చలకు చైనా అన్ని ప్రయత్నాలు చేస్తుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి యూఎన్ఓలో చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో చర్చలు జరపాల్సిన అవసరం మాకు లేదని పుతిన్ అన్నారు. ఇండోనేషియా వేదికగా జరిగే జీ-20 సమ్మిట్ లో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై భారీ దాడులు అవసరం లేదని తెలిపారు పుతిన్. గత వారం పుతిన్ ఉక్రెయిన్ లోని 18 శాతం భూభాగాన్ని, తూర్పు ప్రాంతంలో ఉన్న ఖేర్సన్, జపొరిజ్జియా, లూహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో అధికారికంగా విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!