Russia-Ukraine war: రష్యా దాడిలో 23 మంది సాధారణ పౌరులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడు నెలలు దాటినా కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధతీవ్రత తగ్గడం లేదు. ఎటువైపు నుంచి ఏ రాకెట్ వచ్చిపడుతుందో అని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు వణికిపోతున్నాయి. మరోవైపు పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ పై దాడులను మరింతగా పెంచేలా ప్లాన్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ జపోరిజ్జియా ప్రాంతంలో దారుణానికి తెగబడింది రష్యా. ఓ పౌరకాన్వాయ్ పై దాడి చేసింది. రష్యా జరిపిన ఈ దాడిలో మొత్తం 23 మంది సాధారణ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ శుక్రవారం తెలిపింది. ఈ విషయాన్ని జపోరిజ్జియా ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ స్టారూఖ్ తెలిపారు. రష్యా దాడులకు తెగబడుతూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన నిందించారు.
Read Also: Jammu kashmir: జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు జేఎం తీవ్రవాదుల హతం
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
ఉక్రెయిన్ జపొరిజ్జియా ప్రాంతంపై అక్కడ ఉన్న అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడులు చేస్తోంది. దీనిపై ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. ఈ అణు విద్యుత్ కేంద్రం పేలిపోతే యూరప్ వ్యాప్తంగా రేడియేషన్ తో ప్రభావితం అవుతుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. 7 లక్షల జనాభా ఉన్న జపొరిజ్జియా ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్నప్పటికీ.. రష్యా పదేపదే దాడులు చేస్తోంది. ఈ ప్రాంతాన్ని రష్యాలో కలుపుకునేందుకు పుతిన్ భావిస్తున్నారు. అయితే జపొరిజ్జియా ప్రాంతంలో కొంత భాగాన్ని రష్యా ఇప్పటికే ఆక్రమించింది. అధికారికంగా ఈ ప్రాంతాన్ని రష్యా తనలో కలుపుకునేందుకు ప్రజాభిప్రాయసేకరణ చేసేందుకు సిద్ధం అయింది.
మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో పట్టుకోల్పోతున్న రష్యా..మరింతగా దాడులు చేసేందుకు పాక్షిక సైనిక సమీకరణ చేయాలని ఇటీవల డిక్రీ జారీ చేశారు. రాబోయే రోజుల్లో యుద్దంలో 3 లక్షల మంది సైన్యాన్ని సమీకరించేందుకు సిద్ధం అయ్యారు. దీంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కీవ్ వంటి ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఉక్రెయిన్ కు నాటో ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంతో రష్యాకు ఎదురొడ్డి నిలబడుతోంది. దీంతో రష్యా నెమ్మదిగా ఉక్రెయిన్ పై పట్టు కోల్పోతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా పాక్షిక సైనిక సమీకరణ చేయడంతో పాటు అవసరం అనుకుంటే అణుబాంబులు వేసేందుకు సిద్ధంగా ఉందని పుతిన్ నాటో, అమెరికా, వెస్ట్రన్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!