Ukraine Russia War: ముగిసిన యుద్ధం.. రష్యా కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ పై నెలరోజులకు పైగా యుద్దోన్మాదంతో రెచ్చిపోతున్న రష్యా, అనూహ్యంగా ఒక కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై వార్లో తొలి దశ ముగిసిందని తెలిపింది. ఇక తూర్పు డాన్ బాస్ ప్రాంతాలపై దృష్టిసారిస్తామని రష్యన్ మిలటరీ ప్రకటించింది. డొంటెస్క్, లుహాంస్క్ లలో రష్యా అనుకూల తిరుగుబాటు దారుల ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. పూర్తిస్తాయిలో వీటిని ఆక్రమించేందుకు వ్యూహం మార్చింది మాస్కో. ఉక్రెయిన్ ప్రతిఘటనతో విసిరివేసారుతున్న రష్యన్ మిలటరీ, చిన్నచిన్న లక్ష్యాల వైపు అడుగులెయ్యాలని వ్యూహం మారుస్తున్నట్టు కనపడుతోంది. అందులో భాగంగానే, క్రిమియా తరహాలో డాన్ బాస్ ప్రాంతాన్నీ, పూర్తిగా తమ కంట్రోల్ తెచ్చుకునేందుకు ప్లాన్ మార్చింది. ఫస్ట్ ఫేజ్లో తమ ప్రధాన లక్ష్యం అసంపూర్తిగా ముగిసిందని రష్యన్ జనరల్ స్టాఫ్ అధిపతి ఒప్పుకున్నారు. అయితే, ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని వీలైనంత వరకు కుదించామన్న రష్యా,ఇక మిగతా ఫోకస్ మొత్తం డాన్ బాస్ పైనేనని తెలిపింది.
Read Also: Traffic Pending Challans: త్వరపడండి.. మిగిలింది 5 రోజులే..
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
రాజధాని కీవ్కు తూర్పున వున్న పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది ఉక్రెయిన్ సైన్యం. ఎక్కడికక్కడ రష్యా బలగాలను బోర్డర్లకు తరిమికొడుతోంది. అటు సౌత్ ఈస్ట్ పోర్ట్ సిటీ అయిన మరియాపోల్ పూర్తిగా ధ్వంసమైంది. పునర్ నిర్మాణానికి ఏళ్లు పడుతుందని మరియాపోల్ మేయర్ చెప్పారు. అటు గతవారం మరియాపూల్ థియేటర్పై రష్యా జరిపిన భీకర దాడిలో దాదాపు 300 మంది చనిపోయారని అధికారవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్-రష్యా సమరం సాగుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు యూరప్ పర్యటన పుతిన్ ను మరింత వేడెక్కిస్తోంది. ఇప్పటికే స్లోవేకియా, పోలాండ్, హంగేరి, బల్గేరియాలకు అదనపు దళాలు పంపాలని నాటో నిర్ణయించింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామన్నారు బైడెన్. ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్లో తాజాగా పర్యటించారు బైడెన్. అమెరికా సైనికుల స్థావరాన్ని సందర్శించారు. లక్షలాది ఉక్రెయిన్ శరణార్థులను పోలాండ్ అక్కున చేర్చుకుంటోందని అభినందించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. మరోవైపు ఉక్రెయిన్ పై మరిన్ని దాడులకు తెగబడుతోంది రష్యన్ ఆర్మీ. సెంట్రల్ ఉక్రెయిన్ లోని మిలటరీ కమాండ్ సెంటర్ పై బాంబు దాడి చేసిందని కీవ్ ప్రకటించింది. అటు ఉక్రెయిన్ ను ఆదుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్తప్తి చేశారు అధ్యక్షుడు జెలెన్ స్కీ. పుతిన్ కు వ్యతిరేకంగా మాస్కోలో ఆందోళనలు తీవ్రమయ్యాయి.
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?