Russia: మేం ఒంటరి కావడం లేదు.. మీరే అవుతున్నారు.. పాశ్చాత్య దేశాలపై రష్యా ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Condemns Western Blackmail: ఇండియాలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో పాశ్చాత్యదేశాలు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాయని, ఇందుకు జీ20 సమావేశాలను వేదికగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించడానికి ఇదే మంచి సమయం అని లావ్రోవ్ అన్నారు. వెస్ట్రన్ దేశాలు అనేక ఏళ్లుగా రష్యాపై యుద్ధానికి ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను అందిస్తున్నాయని దుయ్యబట్టారు.
Read Also: Election Results: ఈశాన్య భారతంలో రెపరెపలాడిన కాషాయ జెండా.. మరోసారి సత్తాచాటిన బీజేపీ
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
పాశ్చాత్య దేశాలు ఇప్పటి తన వలసవాద మనస్తత్వాన్ని వదులుకోవడం లేదని, ప్రపంచ ప్రయోజనాల కన్నా వారి ప్రయోజనాలనే చూసుకుంటున్నారని, పశ్చిమ దేశాలు, ఇతర దేశాల భూమిని స్వాధీనం చేసుకుని ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతీ దేశం కూడా ఇతర దేశాల సార్వభౌమధికారం, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండాలని యూఎన్ చార్టర్ లో ఉందని లావ్రోవ్ గుర్తు చేశారు.
జీ20 సమావేశాల్లో ప్రధాని మోదీ బాధ్యతాయుత పాత్రను పోషిస్తున్నారని, ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అంచనా వేశారని అన్నారు. ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకోవాలనుకునే దేశాలను రష్యా ఎప్పుడు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. భారత్, రష్యా సంబంధాలను అత్యంత వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివర్ణించారు. ప్రపంచ ఎజెండాలపై భారత్ తీసుకుంటున్న బాధ్యతాయుతమైన నిర్ణయాలను తాము అభినందిస్తున్నట్లు వెల్లడించారు. వెస్ట్రన్ దేశాలు రష్యాను ఒంటరి చేద్దాం అని భావించుకుంటూ, వాటికవే ఒంటరిగా మారుతున్నాయని అన్నారు. పశ్చిమ దేశాలు ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వాటిని అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. పాశ్యాత్య దేశాలు దౌత్యం గురించి ఆలోచించడం లేదని, కేవలం బ్లాక్ మెయిల్ మాత్రమే చేస్తున్నారంటూ లావ్రోవ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..