Xi Jinping: చైనా ఆర్థిక వ్యవస్థ క్లిష్టంగా ఉంది.. ఎట్టకేలకు ఒప్పుకున్న షి జిన్పింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping: ఎట్టకేలకు చైనా ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఒప్పుకున్నాడు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయని.. ఇలాంటి సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని జిన్ పింగ్ అన్నారు. ఆర్థిక నష్టాలను అరికట్టేందుకు, తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించాడరు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి’ అనే అంశంపై చైనా అధికారిక మీడియాలో అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, మరిన్ని ప్రయత్నాలు చేయాలని జిన్ పింగ్ తెలిపారు.
50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గతేడాది చైనాలో అత్యల్ప వృద్ధి రేటు నమోదు అయింది. ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఉన్న చైనా మూడు శాతం వృద్ధిరేటుకు మాత్రమే పరిమితం అయింది. 2023లో ఆర్థిక పరిస్థితి సంక్షిష్టంగా ఉందని.. దానిని పునరుద్దరించే ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని జిన్ పింగ్ పేర్కొన్నాడు. ప్రధాన సమస్యలు, ప్రజల అంచనాలను మెరుగుపరచడం, అభివృద్ధిపై విశ్వాసం పెంచడం ప్రారంభించాలని సూచించాడు.
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
Read Also: Lord Hanuman on Aircraft: విమానంపై మళ్లీ ప్రత్యక్షం అయిన హనుమాన్ చిత్రం..
తయారీ విభాగంలో ప్రపంచ అగ్రగామిగా చైనా ఉంది. అయితే కోవిడ్ సంక్షోభం, జీరో కోవిడ్ విధానం, బలవంతపు లాక్ డౌన్లు, టెక్ పరిశ్రమలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అణిచివేత కారణంగా అక్కడ పారిశ్రామిక రంగం దెబ్బతింది. చాలా వరకు పెట్టుబడులు ఇండియా, ఇతర దేశాలకు తరలివెళ్లాయి. ప్రస్తుతం చైనా జీడీపీ 17.94 ట్రిలియన్లకు చేరుకుంది. 1974లో చివరి సారిగా చైనా జీడీపీ 2.3 శాతానికి పరిపోయిండి, ఇదే అతితక్కువ వృద్ధిరేటు. ఇక ఆర్థిక మందగమనం కారణంగా ఆ దేశంలో నిరసనలు పెరిగాయి.
దీనికి తోడు చైనాలో వృద్ధాప్య జనాభా విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు జనాభా రేటు క్షీణిస్తోంది. గతేడాది చివరి నాటికి 60 ఏళ్లు నిండిన వృద్ధుల సంఖ్య 26.7 కోట్లకు చేరింది. ఇది మొత్తం జనాభాలో 18.9 శాతం. 2025 నాటికి 30 కోట్లకు , 2035 నాటికి అక్కడ వృద్ధుల జనాబా 40 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
తాజావార్తలు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!